Bhimavaram: భీమవరంలో భారీగా డ్రగ్స్‌ పట్టుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది.

Bhimavaram: భీమవరంలో భారీగా డ్రగ్స్‌ పట్టుకున్న పోలీసులు

Drugs

Bhimavaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు రోజులుగా పలువురి నుంచి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లేటెస్ట్‌గా మరో వ్యక్తి దగ్గర ఐదు LSD స్టాంప్స్, ఒక గ్రాము MDMA మెతాంఫెటమైన్స్ అనే మత్తు మందు, 20 గ్రాముల గంజాయి, 5ఎక్స్‌టసీ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

సింగుదాసు రిత్విక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. రిత్విక్ బెంగళూరులో చదువుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. అతనికి డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

భీమవరం యువకుడు రోహిత్‌ నుంచి 8 ఎల్ఎస్డీ స్టాంప్స్ స్వాధీనం చేసుకోగా.. పాలకోడేరు మండలం వేండ్రకు చెందిన యువకుడు రాజా ఉపేంద్ర నుంచి వంద గ్రాముల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్‌ స్థానికంగా ఓ హోటల్‌లో డ్రగ్స్‌తో ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.