TDP Protest on Petrol Rates : టీడీపీ ఆధ్వర్యంలో రేపు పెట్రోల్ బంకుల వద్ద ధర్నా
పెరుగుతున్న పెట్రో.డీజిల్ ధరలకు నిరనసగా రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

TDP Protest on Petrol Rates : పెరుగుతున్న పెట్రో.డీజిల్ ధరలకు నిరనసగా రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటలనుంచి 1 గంట వరకు టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంక్ ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ వాయకులకు కార్తకర్తలకు పిలుపునిచ్చారు.
తాను అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్ర చేస్తున్న సమంలో సీఎం జగన్ రెడ్డి హామీ ఇచ్చారని…. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై రూ.17 తగ్గించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
Also Read : FB Own Survey : ఫేస్బుక్తో 36 కోట్ల మందికి రిస్క్!
పక్క రాష్ట్రాల్లో అదనపు సుంకాలు తగ్గించినా.. మన రాష్ట్రంలో మొండిచేయి చూపారని ఆయన దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని చంద్రబాబు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు… ఉద్యోగాలు, ఉపాధి రాదు అని ఆయన తెలిపారు.
కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారిందిని…అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటోందని ఆయన విమర్శించారు. అధిక పెట్రోల్ ధరల కారణంగా ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటారు. లారీల యజమానాలు, కార్మికులు దెబ్బతినడమే కాక.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరతాయని చంద్రబాబు అన్నారు.
పెట్రో భారాలకు జగన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ, దుబారాలే కారణమని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక దేశంలో అధికంగా పెట్రోల్ ధర రూ.110.98కి పెంచారని చంద్రబాబు అన్నారు.
- GVL Narasimha Rao : కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్ వేసుకుంటే ఊరుకునేది లేదు-జీవీఎల్ నరసింహారావు
- CM Jagan Prakasam Tour : ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- Sailajanath : ఏపీలో పాదయాత్ర చేపట్టనున్న శైలజానాథ్
- Amma Vodi Scheme : జగనన్న అమ్మఒడి పథకంపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు : మంత్రి ఆదిమూలపు క్లారిటీ
- అలిపిరిలో తొక్కిసలాటపై విపక్షాల విమర్శల మీద వైవీ ఫైర్
1Sangeetha Sajith : ప్రముఖ గాయని మృతి.. నివాళులు అర్పిస్తున్న సినీ పరిశ్రమ..
2Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు
3Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..
4Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి
5Imran Khan: భారత్ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..
6బిగ్బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్
7Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!
8Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
9Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
10Diamonds: జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యం
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్కర్నూల్లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం