స్పీడ్ : 2 కొత్త బైక్ లు రిలీజ్ చేసిన బీఎండబ్ల్యూ
1,254 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన రెండు ఆధునాతన బైక్ లను బీఎండబ్ల్యూ శుక్రవారం భారత మార్కెట్ లో విడుదల చేసింది.
1,254 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన రెండు ఆధునాతన బైక్ లను బీఎండబ్ల్యూ శుక్రవారం భారత మార్కెట్ లో విడుదల చేసింది.
ఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి శుక్రవారం రెండు అధునాతన బైక్ లు రంగ ప్రవేశం చేశాయి. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ మోటరాడ్ సంస్ధ వీటిని రిలీజ్ చేసింది. లగ్జరీ కార్ల తయారీ సంస్ధ బీఎండబ్ల్యూ గ్రూప్ కి చెందిన ఈ సంస్ధ ‘ఆర్ 1250 జీఎస్, ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్’ పేర్లతో అధునాతన శక్తివంతమైన ఇంజిన్ కలిగిన బైక్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
1,254 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన ఈ బైక్ లకు రూ. 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించి బుకింగ్స్ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ తెలిపింది. వీటి ధర రూ.16.85 లక్షలు– రూ.21.95 లక్షలుగా నిర్ణయించింది.