స్పీడ్ : 2 కొత్త బైక్ లు రిలీజ్ చేసిన బీఎండబ్ల్యూ

1,254 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన రెండు ఆధునాతన బైక్ లను బీఎండబ్ల్యూ శుక్రవారం భారత మార్కెట్ లో విడుదల చేసింది.

  • Published By: chvmurthy ,Published On : January 19, 2019 / 05:32 AM IST
స్పీడ్ : 2 కొత్త బైక్ లు రిలీజ్ చేసిన బీఎండబ్ల్యూ

1,254 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన రెండు ఆధునాతన బైక్ లను బీఎండబ్ల్యూ శుక్రవారం భారత మార్కెట్ లో విడుదల చేసింది.

ఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి శుక్రవారం రెండు అధునాతన బైక్ లు రంగ ప్రవేశం చేశాయి. జర్మనీకి చెందిన  బీఎండబ్ల్యూ  మోటరాడ్ సంస్ధ  వీటిని రిలీజ్ చేసింది.  లగ్జరీ కార్ల తయారీ సంస్ధ బీఎండబ్ల్యూ గ్రూప్ కి చెందిన ఈ సంస్ధ ‘ఆర్‌ 1250 జీఎస్, ఆర్‌ 1250 జీఎస్‌ అడ్వెంచర్‌’  పేర్లతో  అధునాతన శక్తివంతమైన ఇంజిన్‌ కలిగిన బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.  
1,254 సీసీ  ఇంజిన్ సామర్ధ్యం కలిగిన  ఈ బైక్ లకు రూ. 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించి బుకింగ్స్ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ తెలిపింది.  వీటి ధర రూ.16.85 లక్షలు– రూ.21.95 లక్షలుగా  నిర్ణయించింది.