Kishtwar: జమ్మూ కశ్మీర్‭లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

చింగమ్ నుంచి ఛత్రూకు వెళ్లుండగా మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో బోండా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. ఇక మిగిలిన ముగ్గురికి క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందుతున్నట్లు సమాచారం.

Kishtwar: జమ్మూ కశ్మీర్‭లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

8 killed and 3 injured after car falls into gorge in j and k

Kishtwar: జమ్మూ కశ్మీర్‭లోని కిష్ట్వార్‭లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. 11 మందితో ప్రయాణిస్తున్న ఒక ఎస్‭యూవీ కారు అదుపు తప్పి లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ప్రమాదంలో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు కిష్ట్వార్‭ జిల్లా అధికారులు తెలిపారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

చింగమ్ నుంచి ఛత్రూకు వెళ్లుండగా మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో బోండా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. ఇక మిగిలిన ముగ్గురికి క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందుతున్నట్లు సమాచారం.

Taj Mahal: వివాదంలో తాజ్ మహల్.. కృష్ణుడి విగ్రహంతో ఉన్న పర్యాటకుడికి నో ఎంట్రీ.. హిందూ సంఘాల ఆగ్రహం