Rajasthan : యువకుడిని కొట్టారు..మూత్రం తాగించిన దంపతులు!

ఓ యువకుడిని కొట్టడంతో పాటు..అతని చేత మూత్రం తాగించారు ఓ దంపతులు. ఓ రోజంతా నిర్భందించారు. తమింట్లోకి ప్రవేశించి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rajasthan : యువకుడిని కొట్టారు..మూత్రం తాగించిన దంపతులు!

Kota Ps

Forced To Drink Urine : ఓ యువకుడిని తీవ్రంగా కొట్టడంతో పాటు..అతని చేత మూత్రం తాగించారు ఓ దంపతులు. అంతేగాకుండా..ఓ రోజంతా నిర్భందించారు. తమింట్లోకి ప్రవేశించి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా..ఇదంతా అబద్ధమని బాధిత సోదరుడు పోలీసులకు వెల్లడించారు. సోదరుడిని కొడుతుండగా..మూత్రం తాగిస్తూ…వీడియో తీశారని..పొరపాటున ఆన్ లైన్ లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యిందని అతను వెల్లడించారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

Read More : Covid Death : కోవిడ్ మృతుల కుబుంబాలకు రూ.50వేల పరిహారం

మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో 22 ఏండ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అతని సోదరుడు ఆ విషయాన్ని ఖండించారు. అహ్మదాబాద్ లో తన సోదరుడు పని చేస్తుంటాడని, ఇటీవలే సొంతూరుకు వచ్చాడని..జగ్ పురా గ్రామంలో..ఉన్న తమ బంధువులు ఇంటికి రావాలని చెప్పడంతో ఈనెల 14వ తేదీన అతను వెళ్లాడన్నారు. అయితే..అక్కడ తన సోదరుడి చేతులు, కాళ్లు కట్టేసి…కొట్టారని ఆరోపించారు.

Read More : America : తాగొచ్చిన వరుడు..మాజీ ప్రియుడితో వధువు పరార్

అనంతరం బలవంతంగా మూత్రం తాగించారని, రాత్రంతా నిర్భిందించారన్నారు. సోదరుడి మొబైల్ ఫోన్, ఐడీ కార్డుతో పాటు రూ. 22 వేలు నగదును ఆ దంపతులు తీసుకున్నారని పోలీసులకు తెలిపారు. మొబైల్ లో దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డు చేసి పొరపాటున ఆన్ లైన్ లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యిందన్నారు. వీడియో ఆధారంగా…ఆ దంపతులతో పాటు..మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.