Girl Gang Rape Drama : బాబోయ్.. ప్రియుడిని దక్కించుకునేందుకు గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన యువతి

చెంగల్ పట్టులో గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేపట్టారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ అవాస్తవం అని తేలింది. ప్రియుడిని దక్కించుకునేందుకు ప్రియురాలు ఇలా నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు.

Girl Gang Rape Drama : బాబోయ్.. ప్రియుడిని దక్కించుకునేందుకు గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన యువతి

Girl Gang Rape Drama : ప్రియుడిని దక్కించుకునేందుకు ఓ యువతి చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ యువతి ఆడిన నాటకం పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ యువతి ఏం చేసిందో తెలుసా? గ్యాంగ్ రేప్ నాటకం ఆడింది.

తమిళనాడు చెంగల్ పట్టులో గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేపట్టారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ అవాస్తవం అని తేలింది. ప్రియుడిని దక్కించుకునేందుకు ప్రియురాలు ఇలా నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు.

Also Read..Naked Woman : బాబోయ్.. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తడుతున్న మహిళ, భయాందోళనలో స్థానికులు

కేసు వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన యువత.. సలీం అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని అడిగింది. అందుకు అతడు అంగీకరించలేదు. దీంతో ఆ యువతి ఖతర్నాక్ స్కెచ్ వేసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రామా ఆడింది. సలీమ్ తనను గ్యాంగ్ రేప్ చేశాడని సీన్ క్రియేట్ చేసింది. చెంగల్ పట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే యువతి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే, ఆ దిశగా వారు దర్యాఫ్తు చేపట్టారు. తమదైన స్టైల్ లో యువతిని ఎంక్వైరీ చేశారు. విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. గ్యాంగ్ రేప్ నిజం కాదని, అదంతా యువతి ఆడిన డ్రామా అని తేలింది. దీంతో పోలీసులు యువతిపై రివర్స్ కేసు పెట్టారు.

Woman Bites Lips : తిక్క కుదిరింది.. అత్యాచారం చేయబోయిన యువకుడి పెదవి కొరికేసిన మహిళ

ఎందుకిలా చేశావ్ అని పోలీసులు అడగ్గా.. ఎలాగైనా తన ప్రియుడిని దక్కించుకోవాలని అనుకున్నానని, అందుకే ఈ నాటకం ఆడానని యువతి తెలిపింది. అయితే తన ప్లాన్ సక్సెస్ కాలేదంది. కాగా, ఈ కేసులో తనకు క్లీన్ చిట్ లభించడంతో సల్మాన్ కు ఊరట లభించింది. కొందరు వ్యక్తులు తమ స్వలాభం, స్వార ప్రయోజనాల కోసం చట్టాలను ఇలా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగించే విషయం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ”చెంగల్‌పట్టు రైల్వే స్టేషన్‌లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని యువతి ఫిర్యాదు చేసింది. అయితే, తన ప్రియుడిని ట్రాప్ చేసేందుకు ఆమె తప్పుడు ఫిర్యాదు ఇచ్చిందని విచారణలో తేలింది. పెరంబలూరు జిల్లా వేప్పంతట్ట ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి సైదప్పెట్టైలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె చెంగల్పట్టు రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచి ఉండగా, కారులో వచ్చిన నలుగురు వ్యక్తుల ముఠా తనను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహిళను క్షుణ్ణంగా విచారించారు. నలుగురు వ్యక్తులు తనను కారులో కిడ్నాప్ చేశారని మహిళ చెప్పగా, చెంగల్‌పట్టు నగరంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం. యువతి ఓ యువకుడితో కలిసి బైక్ పై వెళ్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులకు మహిళపై అనుమానం వచ్చి విచారణ చేపట్టారు.

సలీం కూడా యువతితో ప్రేమలో ఉన్నాడని, వారిద్దరూ తరచూ ఒంటరిగా కలిసేవారని తేలింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. అయితే సలీం అందుకు నిరాకరించాడు. దాంతో ప్రియుడు సలీంను ట్రాప్ చేయాలని పథకం వేసిన యువతి.. నలుగురితో కూడిన ముఠా తనపై లైంగిక దాడికి పాల్పడిందని డ్రామా ఆడింది” అని పోలీసులు వెల్లడించారు.