Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

Boy Dead : ఓ ప్రైవేట్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న బాలుడు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాల్‌కు వెళ్లాడు. మాల్ నుంచి చాక్లెట్స్ దొంగిలించాడు. ఇది గమనించిన మాల్ మేనేజర్ విద్యార్థిని లోపలికి తీసుకెళ్లి చెంపదెబ్బలు కొట్టాడు.

Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

Boy Dead(Photo : Google)

Bettiah Boy Dead Body : బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చాక్లెట్ దొంగిలించాడని మాల్ మేనేజర్ బాలుడిని కొట్టాడు. ఆ కాసేపటికే బాలుడు శవమై కనిపించాడు. అతడి పక్కనే విషం కలిగిన బాటిల్ లభించింది.

జిల్లాలోని చన్‌పాటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని టికులియా చౌక్‌లో ఓ మాల్‌ ఉంది. మాల్ కి వెళ్లిన బాలుడు చాక్లెట్లు దొంగిలించాడు. దీన్ని సీసీటీవీ కెమెరాలో గుర్తించిన మాల్ మేనేజర్.. బాలుడిని తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిని తిట్టాడు. చెంప దెబ్బలు కొట్టాడు. ఆ తర్వాత వదిలేశాడు. అయితే, మాల్ సమీపంలో ఉన్న చక్కెర మిల్లులో ఆ బాలుడి మృతదేహం కనిపించింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటన మే 2న జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న బాలుడు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాల్‌కు వెళ్లాడు. మాల్ నుంచి చాక్లెట్స్ దొంగిలించాడు. ఇది గమనించిన మాల్ మేనేజర్ విద్యార్థిని లోపలికి తీసుకెళ్లి చెంపదెబ్బలు కొట్టాడు. ఆ తర్వాత వదిలిపెట్టాడు.

Also Read..Tech Tips in Telugu : మీ వాట్సాప్‌కు ఈ నెంబర్ల నుంచి ఫేక్ కాల్స్ వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా సైలెంట్‌లో పెట్టేస్తే సరి..!

కానీ, ఇది జరిగిన కాసేపటికే.. మాల్‌కు కొంత దూరంలో ఉన్న షుగర్ మిల్లు గ్రౌండ్‌లో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర పురుగుల మందు బాటిల్‌ కనిపించింది. దాంతో బాలుడు విషం తాగి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మాల్ మేనేజర్ కొట్టడంతో మనస్తాపానికి గురైన బాలుడు.. సూసైడ్ చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాల్ మేనేజర్ పవన్ దూబేపై కేసు బుక్ చేశారు.

కాగా.. మాల్ మేనేజర్ బాలుడి సైకిల్‌, స్కూల్ బ్యాగ్ ను తన దగ్గరే ఉంచుకున్నాడు. మాల్ మేనేజర్ తనను తిట్టడం, కొట్టడం.. సైకిల్, బ్యాగ్ తన దగ్గరే ఉంచుకోవడం, ఇంట్లో వాళ్లకు విషయం తెలియడం.. ఈ పరిణామాలతో బాలుడు భయపడిపోయాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు. దాంతో విషం తాగి సూసైడ్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

Also Read..Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?