Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?

ఆమెకేమైంది? బైకులను ఎందుకు అలా నిప్పుపెట్టి కాల్చేస్తోంది? బైకుల్లో పెట్రోలు తీసి ఆ బైకులనే ఎందుకు కాల్చేస్తోంది? ఆమె ఎవరు? ఎందుకలా చేస్తోంది?

Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?

Delhi

Delhi: రోజంతా పనులపై తిరిగి వచ్చి ఇంటిముందో లేక ఇంటి ఆవరణలోనే బైకులను పార్క్ చేస్తుంటారు యజమానులు. కానీ ఇంటి ముందే ఉంది కదాని బైక్ సేఫ్టీగా ఉంటుందనే ధీమాగా ఉన్నారా? హాయిగా ఇంటిలో నిద్రపోతున్నారా? అయితే తెల్లారేసరికి మీ బైకు కనిపించకుండాపోవచ్చు..లేదా మంటల్లో కాలిపోయి ఉండొచ్చు. కొంతమంది సైకోలు చేసే పనులతో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మీ బైకు మంటల్లో కాలిపోవచ్చు..ఇంటిముందే పార్క్ చేసిన బైకులకు నిప్పు పెట్టే సైకోగాళ్లు ఎందరో..అందరు పడుకున్నాక సైకోలు నిద్రలేస్తారు. ఇళ్లముందు పార్క్ చేసిన బైకులకు నిప్పు పెట్టేసి ఆనందపడతారు. అటువంటి సైకోలు ఎంతోమంది బైకులకు నిప్పు పెట్టిన వార్తలు వింటున్నాం.

కానీ ఢిల్లీలో ఓ మహిళే సైకోగా మారి ఇళ్లముందు పార్క్ చేసిన బైకులకు నిప్పు పెడుతోంది. అందరు పడుకున్నాక ఎవ్వరు బయట తిరగని సమయంలో బయటకొస్తుంది. అటూ ఇటూ చూస్తుంది. ఇళ్లముందు పార్క్ చేసిన బైకుల పెట్రోల్ లీక్ చేసి నిప్పు పెట్టి పారిపోతుంది. అలా ఆమె బైకు పెట్రోలు పైప్ విప్పి పెట్రోలు కిందకు ధారలా కారాగా బైకుకు నిప్పు పెట్టి పారిపోతున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీలో ఒక మహిళ బైకులకు నిప్పు పెట్టడం అలవాటుగా మార్చుకుంది. చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని బైక్‌నుంచి పెట్రోల్‌ తీసి నిప్పు పెడుతోంది. కొంత కాలంగా ఈ మహిళ బైక్‌లకు నిప్పు పెడుతూ ఆనందపడుతోంది. తాజాగా ఈ ఘటన ఢిల్లీ దక్షిణ ఈశాన్య జిల్లా జైత్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. రాత్రి పూట ఎవరూ లేని సమయంలో ఓ బైక్‌కు నిప్పు పెట్టింది. ఆ తర్వాత మరో బైక్‌ను కాల్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. మహిళ బైక్‌ను కాల్చివేసే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.