China : కోళ్లపై ఫ్లాష్ లైట్ కొట్టి చంపిన వ్యక్తికి జైలు శిక్ష
కోళ్లను చంపిన వ్యక్తికి న్యాయస్థానం ఆరు నెలలు జైలుశిక్ష విధించింది.
China : కోళ్లను చంపిన వ్యక్తికి న్యాయస్థానం ఆరు నెలలు జైలుశిక్ష విధించింది. పొరుగింటి వ్యక్తిపై ఉండే కక్షతో చేశాడో గానీ చైనాలో ఓ వ్యక్తి కోళ్లపై ఫ్లాష్ లైట్ కొట్టటంతో 1,100 కోళ్లు చనిపోయాయి. దీంతో కోళ్ల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈకేసును కోర్టుకు సమర్పించటంతో కోళ్ల చనిపోవటానికి కారణమైన వ్యక్తికి కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.
చైనాలో తన పొరుగింట్లో ఉంటున్న మిస్టర్ గు అనే వ్యక్తితో జాంగ్ కు గొడవలు జరుగుతున్నాయి. ప్రతీ విషయంలోను ఇద్దరు గొడవపడుతుంటారు. ఈ గొడవకాస్తా 2022 ఏప్రిల్ నుంచి మరింతగా పెరిగాయి. దీనికి కారణం తన చెట్లను నరికివేస్తున్నాడని జాంగ్ ఆరోపించాడు. దీంతో జాంగ్ కు కోపం వచ్చింది. నీ పని చెప్తానుండు అన్నట్లుగా జాంగ్ కోళ్ల ఫారమ్లోకి చొరబడి..కోళ్ల ముఖాలపైకి ఫ్లాష్లైట్ కొట్టాడు. దీంతో కోళ్లన్నీ భయంతో ఒక మూలకు చేరి చనిపోయాయి.
అలా ఓకేరోజు జాంగ్ కోళ్లఫారంలో 460 కోళ్లు చనిపోయాయి. ఇది జాంగ్ పనేనని గ్రహించి జాంగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాంగ్ ను అరెస్ట్ చేశారు.నష్టపరిహారంగా జాంగ్కు 3000 యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.35,700 చెల్లించాల్సిందిగా రాజీ కుదిర్చారు.
దీంతో జాంగ్పై మిస్టర్ గుకు ఇంకా కోపం పెరిగిపోయింది. మరోసారి కోళ్ల ఫారమ్లోకి చొరబడి మరొమరోసారి ఫ్లాష్ లైట్ వేయటంతో 640 కోళ్లు చనిపోయాయి. మళ్లీ జాంగ్ పోలీసులు మొరపెట్టుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి సెంట్రల్ చైనాలోని హునాన్ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉద్దేశపూర్వకంగానే ఇతరులకు ఆస్తి నష్టం కలిగించాడని గుర్తించి జాంగ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చనిపోయిన 1100 కోళ్ల విలువ దాదాపు 13,840 యువాన్లు (రూ.1,64,855) ఉంటుందని అధికారులు అంచనావేశారు.