Father Kills Daughter : కూతురినే కిడ్నాప్ చేసిన తండ్రి.. కొడుకుతో కలిసి..

స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా పరువు, ప్రతిష్ట పేరుతో కొందరు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. పరువు పేరుతో కడుపున పుట్టిన పిల్లలను కడతేరుస్తున్నారు. కూతురు..

Father Kills Daughter : కూతురినే కిడ్నాప్ చేసిన తండ్రి.. కొడుకుతో కలిసి..

Father Kills Daughter

Father Kills Daughter : స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా పరువు, ప్రతిష్ట పేరుతో కొందరు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. పరువు పేరుతో కడుపున పుట్టిన పిల్లలను కడతేరుస్తున్నారు. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని, వివాహం చేసుకుందని కన్న తల్లిదండ్రులే దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు.

తాజాగా ఒక తండ్రి తన కూతురు కులం కాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వెళ్లేలా ప్లాన్ చేశారు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

World Diabetes Day 2021 : ప్రతి షుగర్ పేషెంట్ తప్పక తినాల్సిన 5 పండ్లు ఇవే..!

ఉత్తరప్రదేశ్‌‌లోని షాజహాన్‌పూర్ ప్రాంతానికి చెందిన బుద్ధపాల్ సక్సేనా కూతురు రోషిణి.. అదే గ్రామానికి చెందిన ప్రభాత్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే అతడు వారి కులం కాకపోవడంతో తమ పెళ్లికి ఒప్పుకోరని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి బుద్ధపాల్ సక్సేనా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ విషయం బయటకు వస్తే తన పరువు పోతుందని దారుణానికి ఒడిగట్టాడు. తన కొడుకు, మరో ఇద్దరు బంధువుల సాయంతో కన్నకూతురు రోషిణిని కిడ్నాప్ చేశాడు. ఊరికి దూరంగా తీసుకెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని కాల్చి బూడిద చేశారు.

ఆ తర్వాత సక్సేనా నాటకం షురూ చేశాడు. కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడగగా కూతురు ప్రియుడు ప్రభాత్ పేరు చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని విచారించగా అతడు జరిగిందంతా చెప్పాడు.

Urinate : మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళుతున్నారా?..కారణాలు తెలుసా?..

దీంతో పోలీసులకు రోషిణి తండ్రి పై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకొని తమ స్టైల్ లో విచారించారు. అంతే సక్సేనా నిజం కక్కేశాడు. తన కూతురు తనకు తెలియకుండా మరో కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని, అందుకే చంపానని ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి, కొడుకు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.