Kerala Tea Stall Owner : భార్యతో ప్రపంచయాత్ర చేసే టీ స్టాల్ ఓనర్ కన్నుమూత

విదేశీ పర్యటనలతో గుర్తింపు సంపాదించుకున్న కేరళకు చెందిన టీ స్టాల్​ యజమాని​ కేఆర్​ విజయన్ (71)​ శుక్రవారం కన్నుమూశారు.

Kerala Tea Stall Owner : భార్యతో ప్రపంచయాత్ర చేసే టీ స్టాల్ ఓనర్ కన్నుమూత

Kerala2

Kerala Tea Stall Owner: విదేశీ పర్యటనలతో గుర్తింపు సంపాదించుకున్న కేరళకు చెందిన టీ స్టాల్​ యజమాని​ కేఆర్​ విజయన్ (71)​ శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా, విజయన్​, ఆయన భార్య మోహన కేరళలోని ఎర్నాకులంల .. ‘శ్రీ బాలాజీ కాఫీ హౌస్​’ ‘ పేరుతో ఓ టీస్టాల్ స్టాల్ నడిపుతున్నారు. అయితే విదేశీ పర్యటనలు చేయాలన్న ఆసక్తితో వచ్చిన ఆదాయంలో ప్రరి రోజు రూ.300 ఆదా చేసి, మరికొంత అప్పు తీసుకుని పలు దేశాలు సందర్శించారు. తొలిసారిగా 2007లో ఈ దంపతులు ఇజ్రాయెల్​ వెళ్లారు. సోషల్​ మీడియాలో వీరి గురించి వైరల్ అయిన తర్వాత అనేక మంది వీరికి ఫండింగ్ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్రా కూడా 2019లో విజయన్ దంపతుల ఆస్ట్రేలియా ట్రిప్​కు స్పాన్సర్​ చేశారు.

గడిచిన 14ఏళ్లతో మొత్తం 26 దేశాలు చుట్టేశారు ఈ దంపతులు. ఇటీవలే రష్యా టూర్ కి వెళ్లొచ్చారు. ఏడాది అక్టోబరు 21-28 మధ్య రష్యాను సందర్శించారు. ఇదే వీరి చివరి విదేశీ ట్రిప్. ఇక,విజయన్​ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ALSO READ Coronavirus Lockdown : లాక్ డౌన్ ల కాలం వచ్చేసింది..కరోనా ఫిఫ్త్ వేవ్ భయంతో ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్