Murder Case : శ్రీరంగాపురం హత్య కేసులో నిందితుడు అరెస్ట్

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద ఈనెల 5న జరిగిన రమేష్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Murder Case : శ్రీరంగాపురం హత్య కేసులో నిందితుడు అరెస్ట్

Kodada Murder case

Murder Case : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద ఈనెల 5న జరిగిన రమేష్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పుట్టిన రోజు వేడుకలో తన భార్యను అవమానించాడనే కోపంతో నిందితుడు, రమేష్ ను హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. పధకం ప్రకారమే రమేష్ ను బైక్ పై తీసుకువెళ్లి మద్యం తాగించి నిందితుడు హత్యచేసాడని పోలీసులు తేల్చారు. నిందితుడు వెంకటేశ్వరరావుపై గతంలో కృష్ణాజిల్లాలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు వెంకటేశ్వరరావు, హతుడు రమేష్ ఇద్దరూ స్నేహితులే. ఒక పుట్టిన రోజు ఫంక్షన్ లో వెంకటేశ్వరరావు భార్యను హతుడు అవమానించాడు. అది మనసులో పెట్టుకుని వెంకటేశ్వరావు, రమేష్‌ను ఈనెల 5వ తేదీన మద్యం సేవించేందుకు రమ్మని పిలిచాడు. పధకం ప్రకారం రమేష్‌కు ఎక్కువ మద్యం తాగించిన అనంతరం వెంకటేశ్వరరావు బండరాయితో కొట్టి హత్య చేశాడు.

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  వెంకటేశ్వర రావు ఓ హత్యా… హత్యాయత్నం… పలు చోరీల్లో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించారు. ఒక పోలీసు స్టేషన్ లో అతడిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్లు సీఐ నరసింహారావు  తెలిపారు.  నేరం రుజువు కావటంతో నిందితుడిని రిమాండ్ కు తరలించారు.