Delhi : తండ్రిని కొట్టిన వ్యక్తిపై బాలుడి ప్రతీకారం-తుపాకీతో కాల్పులు

ఏడు నెలల కిందట తన తండ్రిని కొట్టాడనే కోపంతో  బాలుడు ఒక వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.

Delhi : తండ్రిని కొట్టిన వ్యక్తిపై బాలుడి ప్రతీకారం-తుపాకీతో కాల్పులు

Delhi

Delhi :  టీవీల ప్రభావమో, సినిమాల ప్రభావమో తెలియదు కానీ చిన్న,చిన్న పిల్లలు కూడా ప్రతీకారేఛ్ఛతో రగిలిపోతున్నారు. ఏడు నెలల కిందట తన తండ్రిని కొట్టాడనే కోపంతో  బాలుడు ఒక వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. అక్కడ సీసీటీవీలో   రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జహంగీర్‌పురి  ప్రాంతానికి చెందిన జావేద్(36) అనే   వ్యక్తి   శుక్రవారం సాయంత్రం స్ధానిక పార్కు వద్ద కూర్చుని ఉన్నాడు. ఆసమయంలో అటుగా నడుచుకుంటూ   ముగ్గురు బాలురు వచ్చారు. వారిలో ఒక బాలుడు అతనికి పరిచయం ఉన్నవాడే.  ఆ బాలుడు జావేద్ వద్దకు వస్తూనే జేబులోంచి తుపాకీ తీసి అతని ముఖంపై కాల్పులు   జరిపాడు. అనంతరం ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.

బాలుడి కాల్పుల్లో   జావేద్ కుడి కంటికి తీవ్ర  గాయమయ్యింది.  అతడిని మొదట స్ధానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కొసం మరో ఆస్పత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. జావేద్ పై కాల్పులకు  కారణమైన నలుగురిని  అదుపులోకి తీసుకున్నారు.

వారిలోని ఒక బాలుడి తండ్రిని జావేద్ ఏడునెలల క్రితం కొట్టటంతో  వారు అతడిపై ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ బాలురు నుంచి   పోలీసులు నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.  కంటికి   గాయమైన జావేద్ పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. బాలురపై హత్యాయత్నం   కింద కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.