Bengaluru : ఫుల్ గా మందేశాడు..సాంబార్ టేస్ట్‌‌గా లేదని, తల్లిని, చెల్లిని చంపేశాడు

సాంబార్ వడ్డించడంతో..అది రుచిగా లేదని తల్లి, సోదరితో గొడవకు దిగాడు. వీరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.

Bengaluru : ఫుల్ గా మందేశాడు..సాంబార్ టేస్ట్‌‌గా లేదని, తల్లిని, చెల్లిని చంపేశాడు

Karnataka

Sambar Has No Taste : మద్యం ఎన్నో కుటుంబాలను విచ్చిన్నం చేసింది. కుటుంబాలను రోడ్డున పాల్జేసింది. మద్యం మత్తులో ఏమి చేస్తున్నారో వారికే తెలియదు. మత్తు నషాలానికి చేరుకోవడంతో దారుణాలకు పాల్పడుతున్నారు. సొంత వాళ్లు..పరాయి వాళ్లు అనే తేడా లేకుండా..విచక్షణ కోల్పోతున్నారు. చిన్న చిన్న కారణాలకే… ప్రాణాలు సైతం తీసేస్తున్నారు. తనకిష్టమైన చికెన్ కూర వండలేదని భార్యను ప్రాణం తీయడం..ఇతరత్రా కారణాలతో సొంతింటి వాళ్లనే కడతేరుస్తున్నారు. తాజాగా..సాంబార్ టేస్టుగా లేదని..మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సొంత తల్లిని, చెల్లిని హతమార్చాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.

Read More : Tamilnadu : టీచరేనా ? విద్యార్థిని కాలితో తన్నుతూ..కర్రతో చావబాదాడు..వీడియో వైరల్

ఉత్తర కన్నడ జిల్లాలోని దోడో మణెలో 47 సంవత్సరాలున్న పార్వతి, భర్తతో నివాసం ఉంటోంది. ఈమెకు 24 సంవత్సరాలున్న కొడుకు మంజునాథ్ హాస్లర్, కూతురు రమ్య (19) ఉన్నారు. మంజునాథ్ మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఫుల్ గా మందు కొట్టి..ఇంటికి వచ్చాడు. భోజనం చేసేందుకు కూర్చొన్నాడు. సాంబార్ వడ్డించడంతో..అది రుచిగా లేదని తల్లి, సోదరితో గొడవకు దిగాడు. వీరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.

Read More : Hyd : నగ్న వీడియోలతో యువకుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి!

మద్యం మత్తులో ఉన్న మంజునాథ్ అక్కడనే ఉన్న నాటు తుపాకీ తీసుకుని తల్లి, చెల్లిపై కాల్పులు జరిపాడు. దీంతో వారు పార్వతి, రమ్యలు అక్కడికక్కడనే కుప్పకూలిపోయారు. ఈ సమయంలో పార్వతి భర్త ఇంట్లో లేడు. సమాచారం అందుకున్న పార్వతి భర్త..కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.