కూతుర్ని ప్రేమిస్తున్నాడని దళిత యువకుడ్నికొట్టి చంపేసిన కుటుంబం
తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని ఓ దళిత యువకుడ్ని అగ్రవర్ణానికి చెందిన కుటుంబ సభ్యులు ఘోరాతి ఘోరంగా ఇనుపరాడ్లతో కొట్టి చంపారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ దారుణ ఘటన జరిగింది. 20 ఏళ్ల విరాజ్ జగ్తాప్కు అగ్రకులానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. స్నేహంగా ప్రారంభమైన వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు గంగవెర్రులెత్తిపోయారు. అతడ్ని ఎలాగైనా సరే మట్టుపెడతామనుకున్నారు. దానికో ప్లాన్ వేశారు.
మాట్లాడుకుందామని రమ్మని చెప్పారు. సోమవారం (జూన్ 9,2020) రాత్రి అతడ్ని ఇంటి నుంచి బయటకు రప్పించారు. అలా రోడ్డు మీద బైక్పై వెళ్తున్న విరాజ్ను తమ వాహనం వెంబడించారు. వెనుకనుంచి బలంగా విరాజ్ బైక్ ను ఢీకొట్టారు. ఆ దెబ్బరు అతని కిందపడిపోయాడు. లేవటానికి ప్రయత్నించే క్రమంలో నలుగురు వ్యక్తులు ఇనుపరాడ్లు, బండలు, రాళ్లతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.
నువ్వెంత నీ బ్రతుకెంతరా?.మా ఇంటి పిల్లకు జోలికి వస్తావా? అంటూ ఇష్టమచ్చినట్లుగా చావబాదారు. సదరు యువతి తండ్రి పచ్చి బూతులు తిట్టి దారుణంగా కొట్టాడు. విరాజ్ మొహంపై ఉమ్మి వేశాడు. తీవ్రంగా గాయపడిన విరాజ్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తరువాత విరాజ్ ఒళ్లంతా గాయాలు రక్తం కారుతుండగా హాస్పిటల్ కు వెళ్లాడు. ఆ తరువాత చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న యువతి తండ్రి జగదీష్ కేట్ తో పాటు ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో జగతాప్ అనే వ్యక్తి విరాజ్ ను చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా మిగిలినవారంతా ఇనుపరాడ్లు, రాళ్లతో విరుచుకుపడ్డారు. దీనిపై పోలీస్ కమిషనర్ సందీప్ బిష్ణోయ్ మాట్లాడుతూ..విరాజ్ పై దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశామని షెడ్యూల్డ్ కుల,తెగల చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.