Tamilnadu : డ్రైవర్ను పెళ్లి చేసుకున్న మంత్రి గారి కూతురు
తమిళనాడులో ఓ మంత్రి కూతురు ఆ ఇంటి డ్రైవర్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. సినిమాటిక్ గా జరిగిన ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏమిటంటే తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని మంత్రి ఫిర్యాదు ఇవ్వగ
Tamilnadu : తమిళనాడులో ఓ మంత్రి కూతురు ఆ ఇంటి డ్రైవర్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. సినిమాటిక్ గా జరిగిన ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏమిటంటే తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని మంత్రి ఫిర్యాదు ఇవ్వగా… పక్క రాష్ట్రానికి వెళ్లి పెళ్లి చేసుకుని.. అక్కడ తన తండ్రితో ప్రాణహాని ఉందని ఆ దంపతులు ఫిర్యాదుచేశారు.
వివరాల్లోకి వెళితే… తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు కుమార్తె జయ కళ్యాణి తమ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే సతీష్ అనే వ్యక్తితో ఆరేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని… ఆమె తన తండ్రికి తన ప్రేమ విషయం చెప్పింది.
Also Read : Rashmika Mandanna : ఉమెన్స్డే రోజు బోల్డ్ ఫొటోలతో మ్యాగజైన్ పై రచ్చ చేసిన రష్మిక
అందుకు మంత్రి గారు ఒప్పుకోలేదు, పైగా సతీష్ దళితుడు, తన వద్ద డ్రైవర్ కూడా అవటంతో అంగీకరించలేదు. రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సాయంతో సతీష్ ను నిర్భందించాడు కూడా. అప్పట్లో సతీష్,జయ కళ్యాణి మైనర్లు కావటంతో ఎవరూ స్పందించలేదు.
పోలీసుల నిర్భంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత సతీష్ జరిగిన ఘటన గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మీడియాలో వైరల్ య్యింది. ఇప్పడు ఇద్దరూ మేజర్లు కావటంతో బెంగుళూరులోని ఒక సామాజిక కార్యకర్త సహాయంతో మార్చి 7వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి తనకు, తన భర్తకు తండ్రి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని… తమకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఇద్దరూ కలిసి బెంగుళూరు పోలీసు కమీషనర్ కమల్ పంత్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన శేఖర్బాబు.. సీఎం స్టాలిన్కు అత్యంత సన్నిహితుడు కూడా. కర్ణాటక పోలీసులు ఈ కేసు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.