Actor Naresh : సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు నటుడు నరేశ్.. ఆ కేసు దర్యాఫ్తులో పురోగతిపై ఆరా

సినీ నటుడు నరేశ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తనపైన, పవిత్ర లోకేష్ పైన కొన్ని యూట్యూబ్ చానెల్స్ ద్వారా రమ్య రఘుపతి దుష్ప్రచారం చేయిస్తోందని సైబర్ క్రైమ్ పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేశారు నరేశ్. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలను ఇవాళ సమర్పించారు.

Actor Naresh : సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు నటుడు నరేశ్.. ఆ కేసు దర్యాఫ్తులో పురోగతిపై ఆరా

Actor Naresh : సినీ నటుడు నరేశ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తనపైన, పవిత్ర లోకేష్ పైన కొన్ని యూట్యూబ్ చానెల్స్ ద్వారా రమ్య రఘుపతి దుష్ప్రచారం చేయిస్తోందని సైబర్ క్రైమ్ పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేశారు నరేశ్. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలను ఇవాళ సమర్పించారు.

Also Read..Naresh- Pavithra : ఇక అంతా అఫీషియల్.. లిప్ కిస్‌తో నరేష్-పవిత్రా పెళ్లి ప్రకటన..

నేను నా కోసం కాదు సినీ పరిశ్రమపై జరుగుతున్న దుష్ప్రచారంపై పోరాటం చేస్తున్నా అని నరేశ్ అన్నారు. సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ క్రిటిక్స్ కి.. సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలతో సంబంధం ఏంటి? అని నరేశ్ ప్రశ్నించారు.
కొన్ని అడ్రస్ లేని చానల్స్ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని నరేశ్ ఆరోపించారు.

Also Read..Naresh-Ramya : నరేశ్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. మూడో భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ కోర్టులో కేసు వేసిన నరేశ్..

చెరువులు, కళలు పలు సామాజిక అంశాలపై తాను పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి వివరాలు కనుక్కునేందుకు పీఎస్ కు వచ్చానన్నారు నరేశ్. ఓవరాల్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. మూడు యూట్యూబ్ ఛానల్స్ తమ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి అన్నీ తెలిసినట్టే ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ ఛానల్ కి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు నరేశ్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టాలీవుడ్ లో గతేడాది బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్-పవిత్ర లోకేష్. ఓ సినిమాలో కలిసి నటించిన వీరు బయట కూడా చెట్టా పట్టాలేసుకుని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక నరేష్ తన మూడో భార్య రమ్యతో గొడవలు పడటం, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది.

నరేష్-పవిత్రా లోకేష్ పై పలు వార్తలు, గాసిప్స్ వచ్చినా అధికారికంగా స్పందించకపోగా వీరిపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ గతంలో పలు యూట్యూబ్ ఛానల్స్, సైట్స్ మీద పోలీసు కేసు కూడా పెట్టారు. సోషల్ మీడియాలో అయితే వీరిపై ఓ రేంజ్ లో మీమ్స్ వచ్చాయి.

గత కొన్నాళ్లుగా నరేశ్ కు తన మూడో భార్య రమ్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు రచ్చకెక్కి మీడియాలో వచ్చాయి. నరేశ్ విడాకులకు అప్లయ్ చేసినా రమ్య మాత్రం విడాకులు ఇవ్వనంటోంది. నరేశ్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వనని ఆ మధ్యన రమ్య చెప్పింది. ఇక, రమ్య తనపైన, పవిత్రపైన పలు యూట్యూబ్ చానల్స్ ద్వారా దుష్ప్రచారం చేయిస్తోందన్నది నరేశ్ ఆరోపణ. దీనిపై ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.