Naresh-Ramya : నరేశ్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. మూడో భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ కోర్టులో కేసు వేసిన నరేశ్..

ఇటీవల రమ్య మీడియాతో మాట్లాడుతూ పవిత్ర లోకేశ్ పై దారుణంగా విమర్శలు చేసి నరేశ్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వను అని చెప్పింది. వీళ్ళ ఎపిసోడ్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది. తాజాగా నరేశ్ తన మూడో భార్య రమ్య నుంచి...............

Naresh-Ramya : నరేశ్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. మూడో భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ కోర్టులో కేసు వేసిన నరేశ్..

Senior actor Naresh files a case on her third wife Ramya

Naresh-Ramya :  సీనియర్ నటుడు నరేశ్ గత కొంతకాలంగా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నాడు. తన మూడో భార్య రమ్య రఘుపతిని వదిలేసి పవిత్రా లోకేశ్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. దీనికంటే ముందే గత కొన్నాళ్లుగా రమ్య , నరేశ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలు రచ్చకెక్కి మీడియా వరకు వచ్చాయి. రమ్యతో విడాకులు అప్లై చేసినా రమ్య మాత్రం విడాకులు ఇవ్వను అంటుంది.

ఇటీవల రమ్య మీడియాతో మాట్లాడుతూ పవిత్ర లోకేశ్ పై దారుణంగా విమర్శలు చేసి నరేశ్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వను అని చెప్పింది. వీళ్ళ ఎపిసోడ్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది. తాజాగా నరేశ్ తన మూడో భార్య రమ్య నుంచి ప్రాణహాని ఉందని కోర్టులో కేసు వేశాడు. తనకు రమ్యతో ప్రాణహాని ఉందని, నా ఆస్తి కాజేయడానికి ప్రయత్నిస్తుందని, ఒప్పుకోవకపోవడంతో చంపేందుకు ప్రయత్నించిందని, రమ్య బంధువు అయిన కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేయించి బెదిరించిందని, తనతో నాకు విడాకులు ఇప్పించాలని కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేశాడు..

Jamuna : సినిమాలు, రాజకీయాలు, సమాజంలో ఎంతో సేవ.. అయినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని జమున ఆవేదన..

దీంతో మరోసారి నరేశ్ వార్తల్లో నిలిచారు. మరి దీనిపై రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి. దీనిపై పవిత్రా లోకేశ్ కూడా స్పందించలేదు. రమ్య, నరేశ్, పవిత్రా ఎపిసోడ్ లో ఈ ట్విస్ట్ తో ఆసక్తిగా మారి వైరల్ అవుతుంది.