Childrens With Skeleton : కొడుకుని హత్య చేసిన తల్లి..ఆ అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న ముగ్గురు సోదరులు

ఓ తల్లి కసాయిగా మారి కన్న కొడుకునే హత్య చేసింది. ఆ చనిపోయిన సోదరుడి అస్తిపంజరంతోనే కలిసి ఉంటున్నారు ముగ్గురు సోదరులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తల్లిని అరెస్ట్ చేయటంతో..

Childrens With Skeleton : కొడుకుని హత్య చేసిన తల్లి..ఆ అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న ముగ్గురు సోదరులు

Three Childrens Were Found In With Siblings Skeleton

Three Childrens Were Found In With Siblings Skeleton : టెక్సాస్‌ లో నివసించే 35 ఏళ్ల గ్లోరియా విలియమ్స్ అనే మహిళకు నలుగురు మగపిల్లలు. ఆ నలుగురి పిల్లల్ని హ్యస్టన్‌ అపార్ట్‌మెంట్‌లో వదిలేసి వేరే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని అతనితోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆ కొడుకుల్లో ఓ కొడుకు హత్యకు గురయ్యాడు. వారి తల్లే తన పార్టనర్ తో కలిసి కొడుకును చంపేసిందనే అనుమానంతో పోలీసులు అమెను అరెస్ట్ చేశారు. ఆమే కొడుకును తన పార్టనర్ తో కలిసి హత్య చేసిందని టెక్సాస్‌ పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన కేసు నడుస్తోంది.

Read more : Three Daughters same birthday : ఒకే నెల ఒకే తారీఖు..ఒకే జంటలకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు

ఈ ఘటనపై టెక్సాస్ పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ ముగ్గురు మగపిల్లలు తమ సోదరుడు హత్యకు గురైన హ్యుస్టన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. పైగా హత్య గురై చనిపోయిన తమ సోదరుడి అస్థిపంజరం అవశేషాలతో కలిసి ఉంటున్నారని పోలీసులు తెలిపారు. నలుగురు పిల్లల్లో ఓ పిల్లాడిని హత్య చేసిన వారి తల్లి గ్లోరియా విలియమ్స్ సాక్ష్యాలను మాయం చేయటానికి మిగిలిన ముగ్గురు పిల్లలను కూడా గాయపరిచిందని తమ దర్యాప్తులో వెల్లడైందని వెల్లడించారు.

అంతేకాదు ఆ పిల్లలు ముగ్గురే ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారని..చాలా కాలంగా తల్లితండ్రులిద్దరూ అక్కడ ఉండటంలేదని..వారి తల్లి వేరే చోట ఉంటుందోని తన పార్టనర్ తో కలిసి కన్నకొడుకునే చంపేసి సాక్షాలు తారుమారు చేయటానికి మిగిలిన పిల్లల్ని కూడా గాయపరిచిందని తెలిపారు. కొడుకుని హత్య చేసిన తరువాత మిగిలిన ముగ్గురు పిల్లలు చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారనీ..ఆ ముగ్గురు పిల్లలు కూడా ఇరుగు పొరుగు వారి నుంచి ఆహారం తెచ్చుకుని జీవించేవారిని పోలీసులు తెలిపారు.

Read more : Hyderabad : 16 ఏళ్లకే ప్రేమలో పడ్డ అబ్బాయి..వద్దు అన్నందుకు ఆత్మహత్య..