Satvik Case Report : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్.. ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు అందజేసిన ఎంక్వైరీ కమిటీ
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వైరీ కమిటీ రిపోర్టు రెడీ చేసింది. దర్యాప్తు ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిటీ తేల్చింది.

SATVIK (1)
Satvik Case Report : శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వైరీ కమిటీ రిపోర్టు రెడీ చేసింది. దర్యాప్తు ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిటీ తేల్చింది. సాత్విక్ అడ్మిషన్ శ్రీ చైతన్య కాలేజీలో లేదని మరో కాలేజీలో అడ్మిషన్ తీసుకుని సాత్విక్ ఇక్కడ చదువుతున్నట్లుగా గుర్తించింది. దాదాపు అన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇదే బాగోతం నడుస్తున్నట్లు తెలిపింది. శ్రీ చైతన్య క్లాసులు, చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికేట్స్ ఇస్తున్నారని ఈ నివేదికలో పేర్కొంది.
ఇక ర్యాంగింగ్ ఇష్యూపై ఇంకా విచారణ చేయాల్సివుందని కమిటీ తెలిపింది. అడ్మిషన్స్ విషయంపై అన్ని కాలేజీల్లోనూ చెక్ చేయాలని కమిటీ సూచించింది. అధికారులు పాత విషయాలనే మళ్లీ రిపోర్టులో ప్రస్తావించారు. ఇంటర్ విద్యార్థి సాత్విక్(16) ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులకు ఉప్పర్ పల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ఆచార్య(అడ్మిన్ ప్రిన్సిపాల్), నరేశ్(క్యాంపస్ ఇంచార్జి), కృష్ణారెడ్డి(ప్రిన్సిపాల్), శోభన్(వార్డెన్)కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆ నలుగురు నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకి తరలించారు.
నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గత మంగళవారం రాత్రి క్లాస్ రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చెబుతున్నారు.
కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి దుస్తుల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ రాశాడు. తనతోపాటు తన మిత్రులకు కూడా ఆ నలుగురు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు.
Inter Student Sathwik Case : ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. ఆ నలుగురికి రిమాండ్
‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నా. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేని లోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సాత్విక్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.