Inter Student Sathwik Case : ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. ఆ నలుగురికి రిమాండ్
ఇంటర్ విద్యార్థి సాత్విక్(16) ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులకు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ఆచార్య(అడ్మిన్ ప్రిన్సిపాల్), నరేశ్(క్యాంపస్ ఇంచార్జి), కృష్ణారెడ్డి(ప్రిన్సిపాల్), శోభన్(వార్డెన్) కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆ నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు పోలీసులు.
Inter Student Sathwik Case : ఇంటర్ విద్యార్థి సాత్విక్(16) ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులకు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ఆచార్య(అడ్మిన్ ప్రిన్సిపాల్), నరేశ్(క్యాంపస్ ఇంచార్జి), కృష్ణారెడ్డి(ప్రిన్సిపాల్), శోభన్(వార్డెన్) కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆ నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు పోలీసులు.
నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. గత మంగళవారం రాత్రి క్లాస్ రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు.
కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి దుస్తుల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ రాశాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు.
‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నా. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేని లోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు సాత్విక్. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉంది. దాంతో, కొన్ని రోజుల క్రితమే సాత్విక్ ఆ లేఖ రాసి పెట్టుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Also Read..Ramanthapur : అదృశ్యమైన విద్యార్థి అనూష మృతి.. రామంతాపూర్ చెరువులో మృతదేహం లభ్యం
విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చదువుల ఒత్తిళ్లు విద్యార్థుల చావులకు కారణమవుతున్నాయి. మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాత్విక్ ఘటన మరువక ముందే అనూష ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పిల్లలు ప్రయోజకులవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదివిస్తుంటే.. పిల్లలు తీసుకునే కఠిన నిర్ణయాలు మాత్రం కన్నవారికి కడుపు కోతలే మిగులుస్తున్నాయి.
తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. అనూష 2020లో ఇంటర్ పూర్తి చేసింది. అప్పటి నుంచి నీట్ కు ప్రిపేర్ అవుతోంది. రెండుసార్లు ఎగ్జామ్స్ రాసినా సీటు రాలేదు. ఇక మూడో సంవత్సరం నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతోంది. నీట్ పై ఆమెకు ఆసక్తి లేకపోయినా అదే చదవాలని తల్లిదండ్రులు మందలించారు. తనకు ఆసక్తి లేకపోయినా చదవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అనూష మనస్తాపానికి గురైంది. ఇంట్లో నుంచి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. రామంతాపూర్ చెరువులో అనూష మృతదేహం లభ్యమైంది.