Young Girl Raped By Father : 17 ఏళ్ళ బాలికపై తండ్రితో సహా 28 మంది అత్యాచారం..
ఉత్తర ప్రదేశ్ లోని దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిపై తండ్రితో సహా 28 మంది గత కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Young Girl Raped By Father : ఉత్తర ప్రదేశ్ లోని దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిపై తండ్రితో సహా 28 మంది గత కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి పోత్సాహంతోనే ఎస్పీ, బీఎస్పీ నాయకులు తనపై అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది.
బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే …. బాలిక తండ్రి ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బాలిక ఆరో తరగతి చదివే సమయంలో అసభ్యకరమైన చిత్రాలు చూపించి ఆమె తండ్రి లోంగదీసుకోవాలని చూశాడు. దాన్ని తీవ్రంగా బాలిక వ్యతిరేకించటంతో ఊరుకున్నాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకు బైక్ నేర్పించే నెపంతో బైక్ మీద ఎక్కించుకుని కొత్త బట్టలు కొనిపెట్టాడు. ఆతర్వాత ఊరు చివరకు తీసుకువెళ్లి బైక్ నేర్పించే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఈవిషయం ఎవరికైనా చెపితే నీ తల్లిని చంపేస్తానని బెదిరించాడు. దానితో బాలిక మౌనం వహించింది.
ఇది ఇక్కడితో ఆగలేదు. మరోసారి అన్నంలో మత్తు మందు కలిపి తినిపించాడు. ఆతర్వాత ఒక హోటల్ కు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. నిద్రలేచి చూసుకునే సరికి ఆమె ఒంటిపై బట్టలు, బూట్లు సరైన స్ధానంలో లేవు. దీంతో ఆమెకు తెలిసిపోయింది. తనపై అత్యాచారం జరిగిందనే విషయం. తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది.
ఇది చాలాఏళ్లుగా కొనసాగుతోంది… ప్రతిసారీ ఒక కొత్త వ్యక్తి వస్తాడు. అతను అత్యాచారం చేసి వెళతాడు. వెళ్లిన ప్రతిసారి తీవ్రంగా కడుపు నొప్పి వచ్చేది. ఎదురు తిరిగి అదేమని ప్రశ్నిస్తే నీ తండ్రే పంపించాడని చెప్పి అత్యాచారం చేసేవారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది.
ఒకసారి సమాజ్ వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ తో పాటు ఆయన స్నేహితులు బంధువులు, మా బంధువులు కూడా వచ్చి తీవ్రంగా అత్యాచారం చేసి హింసించారని తన ఫిర్యాదులో వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చాలా సున్నితమైన కేసు అని బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని ఐపీసీ సెక్షన్ 161 కింద బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నామని లలిత్ పూర్ ఎస్పీ నిఖిల్ పాఠక్ చెప్పారు. కాగా బాధితురాలి ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ అధ్యక్షుడు తిలక్ యాదవ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలు కొట్టి పారేశారు. తనని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు.