Woman Kills Boyfriend : దారుణం.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

జ్యోతిష్యాన్ని పిచ్చిగా నమ్మిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. జ్యోతిష్యుడు మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసింది. చివరికి కటకటాల పాలైంది.

Woman Kills Boyfriend : దారుణం.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

Woman Kills Boyfriend : ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అర్థంపర్థం లేని అపోహలతో, భయాలతో, పిచ్చి పిచ్చి నమ్మకాలతో ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేస్తున్నారు. జ్యోతిష్యాన్ని పిచ్చిగా నమ్మిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. జ్యోతిష్యుడు మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసింది. చివరికి కటకటాల పాలైంది.

కేరళ తిరువనంతపురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడికి విషం ఇచ్చి చంపేసింది. దీనికి కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలే. తిరువనంతపురానికి చెందిన గ్రీష్మ తన ప్రియుడు షరోన్ కి విషం ఇచ్చి కడతేర్చింది. కషాయంలో పెస్టిసైడ్ కలిపి ప్రియుడితో తాగించి మరీ మర్డర్ చేసింది.

జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని, బ్రేకప్‌ చేసుకున్న ప్రియుడిని మళ్లీ ముగ్గులోకి దింపి మరీ చంపేసింది ఆ యువతి. తిరువనంతపురంలోని పరసాలాకు చెందిన షరోన్‌ రాజ్‌, తమిళనాడుకు చెందిన గ్రీష్మ ప్రేమించుకున్నారు. రెండేళ్లు కలిసి తిరిగారు. కొంతకాలం క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయారు. ఈ క్రమంలో గ్రీష్మకి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి నచ్చడంతో పెళ్లి ఫిక్స్‌ చేశారు. చాలా గ్రాండ్‌గా నిశ్చితార్థం నిర్వహించారు. సెప్టెంబర్‌ లో పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ, చివరి నిమిషంలో పెళ్లిని ఫిబ్రవరికి వాయిదా వేయాల్సి వచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దీంతో గ్రీష్మకు ఎక్కడో అనుమానం వచ్చింది. తమ జాతకాల్లో ఏమైనా తేడా ఉందా అనే అనుమానంతో ఓ జ్యోతిష్యుడిని సంప్రదించింది. మొదటి భర్త చనిపోతాడని అతగాడు గ్రీష్మకి జోస్యం చెప్పాడు. దీంతో గ్రీష్మ, ఆమె కుటుంబసభ్యులు పెద్ద ప్లాన్ వేశారు. షరోన్‌ని మళ్లీ ముగ్గులోకి దింపమని గ్రీష్మకు చెప్పారు. దీంతో మళ్లీ అతనితో మాటలు కలిపింది. పెళ్లి చేసుకుందామని కూడా నమ్మించింది. కన్యాకుమారిలోని తన ఇంటికి షరోన్‌ని రప్పించింది. సాంప్రదాయం ప్రకారం.. కుటుంబ సభ్యులు వారిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత.. ఇంట్లోనే స్నేహితులతో కలిసి, ఓ డ్రింక్ తాగే పోటీ నిర్వహించారు.

ప్లాన్ ప్రకారం ఆయుర్వేదిక్‌ డ్రింక్‌లో గ్రీష్మ విషం కలిపి ప్రియుడికి ఇచ్చింది. అది తాగిన షరోన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 14 రోజుల పాటు ఒక్కో అవయవం పని చేయకుండా చివరికి చనిపోయాడు.

కాగా, పెళ్లైన 14 రోజుల్లోనే తమ కుమారుడు చనిపోవడంతో షరోన్‌ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమ స్టైల్ లో విచారణ చేశారు. దీంతో గ్రీష్మ, ఆమె కుటుంబ సభ్యుల బండారం బట్టబయలైంది. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. షరోన్ ని గ్రీష్మ హత్య చేసిందనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.