Raped : సంతానం కోసం దారుణం.. మహిళను బంధించి 16 నెలలుగా అత్యాచారం

పిల్లల కోసం ఓ జంట దారుణానికి పాల్పడింది. ఓ మహిళను 16 నెలలుగా బంధించారు. ఆమెపై అత్యాచారం చేశారు. చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.

Raped : సంతానం కోసం దారుణం.. మహిళను బంధించి 16 నెలలుగా అత్యాచారం

Raped

Raped : పిల్లల కోసం ఓ జంట దారుణానికి పాల్పడింది. ఓ మహిళను 16 నెలలుగా బంధించారు. ఆమెపై అత్యాచారం చేశారు. చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.

ఉజ్జయినీలోని క‌ధ్ బ‌రోడా గ్రామ మాజీ ఉప స‌ర్పంచ్ రాజ్‌పాల్ సింగ్ కి(38) కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో వారు ఒంటరైపోయారు. ఎలాగైనా తమకు పిల్లలు కావాలని ఒక దారుణమైన పని చేశారు. రాజ్‌పాల్ సింగ్ మ‌ధ్య‌వ‌ర్తుల సాయంతో 16 నెల‌ల కింద‌ట ఓ మ‌హిళను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు.

Bhargavi : భార్గవి ఎక్కడ..? మిస్టరీగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

భార్య చంద్రకాంత(26) సాయంతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, బిడ్డను కనాలని బలవంతం చేశారు. 9 నెలల క్రితం ఆ మహిళ గర్భవతి అయ్యి.. ఇటీవల(అక్టోబర్ 25) ఒక బిడ్డను ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన తరువాత స్పృహ లేని ఆమెను నవంబర్ 6న బస్టాండ్‌లో వదిలి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన మహిళ తన బిడ్డ కావాలని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సింగ్ దంపతులతో పాటు సింగ్ బంధువులు వీరేంద్ర, క్రిష్ణ పాల్, మధ్యవర్తి అర్జున్ లపై ఐపీసీ సెక్షన్లు 370 (హ్యుమన్ ట్రాఫికింగ్) 376 (రేప్), 376 A, 377 (అసహజమైన శృంగారం), 365 (కిడ్నాప్), 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఓ పోలీసు బృందాన్ని నాగ్ పూర్ కి పంపారు. రాజ్ పాల్ సింగ్ ఆ మహిళను ఎంత డబ్బుకి కొన్నాడో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.