Siddipet: పెళ్లయి పిల్లలున్న మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. చివరికి ప్రాణాలు తీసింది..

వివాహేతర సంబంధాలు పెట్టుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నిత్యం సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తన ప్రాణాలు తీసుకున్నాడు.

Siddipet: పెళ్లయి పిల్లలున్న మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. చివరికి ప్రాణాలు తీసింది..

Illegal Relationship

Siddipet: పెళ్లయిన మహిళ (married woman) తో వివాహేతర సంబంధం (extramarital affair) పెట్టుకున్న ఓ యువకుడు చివరికి తన ప్రాణాలు తీసుకున్నాడు. వీరి మధ్య వివాహేతర సంబంధం కొంతకాలం సజావుగా సాగినప్పటికీ.. మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉంటూ యువకుడిని దూరంగా పెట్టింది. దీంతో మానసికంగా కుంగిపోయిన యువకుడు తన స్వగ్రామం వెళ్లి పురుగుల మందు (Pesticide) సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Wife Illegal Relationship: భార్యపై అనుమానంతో ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి..

వివాహేతర సంబంధాలు పెట్టుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నిత్యం సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తన ప్రాణాలు తీసుకున్నాడు. సిద్ధిపేట జిల్లా (Siddipet District) కునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ దుకాణం షాపులో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమెకు పిల్లలుసైతం ఉన్నారు. ఆమెతో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం యువకుడు, మహిళ వివాహేతర సంబంధం సజావుగా సాగింది. ఉన్నట్లుండి యువకుడిని ఆమె దూరం పెడుతూ వచ్చింది.

Illegal Relationship: భర్తను హత్యచేసి ప్రియుడితో పరారైన భార్య.. కూతురు ఫిర్యాదుతో ఆర్నెళ్లకు పోలీసులకు చిక్కిన నిందితులు..

మహిళ దూరం పెట్టడం ప్రారంభించడంతో యువకుడు మానసికంగా కుంగిపోయాడు. ఎందుకిలా చేస్తుందోనని తెలుసుకొనే ప్రయత్నంలో మరో వ్యక్తితో మహిళ చనువుగా ఉంటున్న విషయాన్ని గుర్తించాడు. దీనిని తట్టుకోలేక, తన సొంత గ్రామానికి వెళ్లిన యువకుడు, పొలానికి వెళ్లి పురుగుల మందు సేవించాడు. కొద్దిసేపటికి పొలం నుంచి వచ్చి ఇంటిముందు కుప్పకూలిపోయాడు.  కుటుంబ సభ్యులు యువకుడి వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.. అసలు విషయాన్ని వివరించాడు. వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.