గుడ్ న్యూస్ : 3వేల 25 ఉద్యోగాలకు ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్

  • Published By: venkaiahnaidu ,Published On : October 17, 2019 / 02:34 AM IST
గుడ్ న్యూస్ : 3వేల 25 ఉద్యోగాలకు ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్

నిరుద్యోగులకు విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు 2,500,జూనియర్‌ అసిస్టెంట్‌ కం కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు500, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులు 25.. మొత్తం 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

ఆయా పోస్టులు అర్హతలు, వయస్సు, దరఖాస్తు విధానం, రిజర్వేషన్లు, ఇతర సమాచారం నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థకు చెందిన TS SOUTH POWER CGG.GOV.IN వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్‌ అసిస్టెంట్‌ కం కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు ఈనెల 30వ తేదీ నుంచి ఫీజు చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్‌ 20 గడువుగా ఉంది.  హాల్‌టికెట్లను డిసెంబర్‌ 11 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను డిసెంబర్ 22న నిర్వహిస్తారు.

జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలకు అక్టోబర్‌ 21 నుంచి ఫీజులు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించేందుకు నవంబర్‌ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. హాల్‌టికెట్లను డిసెంబర్‌ 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష డిసెంబర్‌ 15న నిర్వహిస్తారు. జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఆక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 10 వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. హాల్‌ టికెట్లను డిసెంబర్‌ 5 నుంచి  డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష డిసెంబర్‌ 15న నిర్వహిస్తారు.