ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో ఎన్ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టును మార్చి 1న రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు ఈ ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎన్ఐఏ డీజీ వైసీ మోదీ, ఐజీ అలోక్ మిత్తల్ పాల్గొన్నారు.