ట్యాంక్ బండ్ రణరంగం

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2019 / 09:09 AM IST
ట్యాంక్ బండ్ రణరంగం

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ మధ్యాహ్నాం నుంచి ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు,అఖిలపక్ష నేతలు భారీగా చేరుకున్నారు. బారికేడ్లు,ఇనుప కంచెలు దూకి ట్యాంక్ బండ్ వైపు నేతలు దూసుకెళ్లారు. పలువురు నాయకులను,ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. నిరసనకారులు,పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్మికులు నిరసన తెలుపుతూ అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పైకి దూసుకువచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది.  దీంతో పోలీసులు దొరికినవారిని దొరికినట్లు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు.