హైదరాబాద్‌లో అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్

  • Published By: sreehari ,Published On : November 5, 2020 / 07:18 AM IST
హైదరాబాద్‌లో అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్

Oneplus Store in Hyderabad : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్‌ హైదరాబాద్‌ నగరంలో అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను లాంచ్ చేసింది. హిమాయత్‌ నగర్‌లో వన్‌ప్లస్ స్టోర్‌ అంతర్జాతీయంగా కంపెనీకి అతిపెద్ద స్టోర్ ఇదొక్కటే కావడం విశేషం. వన్‌ప్లస్‌ నిజాం ప్యాలెస్‌ పేరుతో 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను తీసుకొచ్చింది.



కస్టమర్లు కన్సల్ట్‌ సర్వీస్‌ ప్రతినిధులను కలిసేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కంపెనీ వెల్లడించింది.

ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లలో వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వన్‌ప్లస్‌ 8T 5G స్మార్ట్‌ఫోన్‌ను పెద్ద ఎత్తునే ప్రమోట్‌ చేస్తున్నారు. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల వినియోగంలోని సౌకర్యాలను, టెక్నాలజీని కస్టమర్లకు వివరించేందుకు ఎగ్జిక్యూటివ్‌లను నియమించింది.



https://10tv.in/threat-calls-to-tanishq-store-in-gujarat-police-patrolling-area/
ఆన్‌లైన్‌ మార్కెట్‌తోపాటు సంప్రదాయ మార్కెట్‌లోనూ నిలదొక్కుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ స్టోర్‌ను భారీ ఎత్తున అందుబాటులోకి తెచ్చామని వన్‌ప్లస్‌ తెలిపింది.



ప్రస్తుతం వన్‌ప్లస్‌కు దేశవ్యాప్తంగా 5వేలకుపైగా రిటైల్‌ స్టోరులు ఉండగా.. విస్తరణకు రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే ఏడాదిలో సర్వీస్‌ సెంటర్‌ నెట్‌వర్క్‌ ద్వారా మరో 100 నగరాల్లో బ్రాండ్‌ విస్తరించాలని వన్‌ప్లస్‌ వెల్లడించింది.