హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ : ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ జరుగుతోంది. పీవీ నర్సింహరావు ఫ్లైవోవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు పోటాపోటీగా నడుపుతూ ప్రయాణికులను హడలెత్తించారు.

  • Published By: veegamteam ,Published On : February 2, 2020 / 06:48 AM IST
హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ : ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ జరుగుతోంది. పీవీ నర్సింహరావు ఫ్లైవోవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు పోటాపోటీగా నడుపుతూ ప్రయాణికులను హడలెత్తించారు.

హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ జరుగుతోంది. పీవీ నర్సింహరావు ఫ్లైవోవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు పోటాపోటీగా నడుపుతూ ప్రయాణికులను హడలెత్తించారు. అతివేగంగా డ్రైవ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు శంషాబాద్ నుంచి మోహిదీపట్నం వైపు వెళ్తున్నట్లు గుర్తించారు.

ఈ రోజు ఆదివారం కావడంతో స్పోర్ట్స్ కారు రేసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ నుంచి మోహిదీపట్నం వైపు వచ్చేటటువంటి పీవీ నర్సింహారావు ఫ్లైవోవర్ పై అతివేగంగా ఈ రెండు కార్లు వెళ్తున్నాయి. కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీరంతా కారు రేసింగ్ పోటీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరే ఉన్నారా? స్పోర్ట్స్ కు సంబంధించిన కారు రేస్ లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వీకెండ్, ఆదివారాల సమయాల్లో ఔటర్ రింగ్ రోడ్డుపై తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏకంగా పివి నర్సింహారావు ఫ్లైవోవర్ పైనే అత్యంత వేంగా వెళ్తున్న రెండు కార్లను పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.