Court Cruel verdict : కొడుకు హత్యకు న్యాయం చేయమన్న తల్లికి 100 కొరడా దెబ్బలు విధించిన కోర్టు

కొడుకు హత్యకు న్యాయం చేయయని కోరిన తల్లికి 100 కొరడా దెబ్బలు విధించింది కోర్టు.

Court Cruel verdict : కొడుకు హత్యకు న్యాయం చేయమన్న తల్లికి 100 కొరడా దెబ్బలు విధించిన కోర్టు

Court Cruel verdict  : పోలీసుల కాల్పుల్లో మరణించిన తన కుమారుడి మృతికి న్యాయం చేయండి అంటూ ఆవేదనతో కోరిన ఓ తల్లికి సాక్షాత్తు న్యాయస్థానమే అత్యంత దారుణమైన శిక్ష విధించింది. 100 కొరడా దెబ్బలు విధించింది కోర్టు..! అన్యాయంగా నా కొడుకును చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్న ఆ తల్లికి ఇరాన్ లోని సాక్షాత్తు న్యాయస్థానమే అత్యంత దారుణమైన శిక్ష విధించింది. ఆ తల్లిని 100 కొరడా దెబ్బలు కొట్టాలని కోర్టు ఆదేశించింది. జెరూసలేం పోస్ట్ ప్రకారం..తన కొడుకును చంపిన పోలీసులను శిక్షించాలని కోరుతూ మెహబూబా రంజానీ అనే మహిళ ‘మదర్స్ ఆఫ్ జస్టిస్’ అనే నినాదంతో ప్రచారం కొనసాగిస్తోంది. ఆమె నినాదం ప్రభుత్వాని ఆగ్రహం కలిగించింది.

2019లో హత్యకు గురైన కొడుకు దేశంలోని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తన గళం వినిపించాడు. మెహబూబా రంజానీ తన కొడుకు జమాన్ కోహ్లిపూర్ మరణాన్ని హత్యగా పేర్కొంటూ అధికారులను శిక్షించాలని ప్రచారం చేస్తున్నారు మొహబూబా రంజానీ. మెహబూబా రంజానీ కుమారుడు జమాన్ 2019లో పీపుల్స్ మూవ్‌మెంట్‌లో చేరాడు. దేశంలోని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తన గళం వినిపించాడు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇరానియన్లు వీధుల్లోకి రావడంతో..పరిపాలన గందరగోళంలో పడింది. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం నిరసనకారులపై పోలీసులతో కాల్పులు జరిపించింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మెహబాబూ కుమారుడు జమాన్‌తో సహా దాదాపు 1500 మంది చనిపోయారు. దీంతో మెహబాబూ తన కొడుకుది హత్య అంటూ నినదించించారు. ఈ హత్యకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

అధికారులకు వ్యతిరేకంగా గొంతు వినిపించడం, న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం ద్వారా రంజాని గొంతును అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జెరూసలెం పోస్ట్ నివేదించింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా గొంతు పెంచినందుకు ఆమె గత వారం రంజనీ సహా అనేక మంది మహిళలను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. ఈ క్రమంలో మెహబూబా తిరిగి కోర్టుకు వెళ్లింది.

యునైటెడ్ స్టేట్స్‌లో ఇరాన్ మూలానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. వారంతా ఇరాన్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు… ఫలితంగా, ఇరాన్‌లోని షరియా కోర్టు ఆమెకు100 కొరడా దెబ్బలు విధించింది. ఈ శిక్షపై పలువురు ఇరానియన్లు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత దృష్ట్యా రంజానిపై కొరడా శిక్షను అమలు చేయటానికి ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. ఎందుకంటే శిక్ష అమలు తేదీని ఇంకా నిర్ణయించలేదు.