Mexico : మెక్సికోలో లోయలో పడిన బస్సు…17 మంది మృతి,22 మందికి గాయాలు

మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పశ్చిమ మెక్సికోలో ప్రయాణీకుల బస్సు జాతీయ రహదారి నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు....

Mexico : మెక్సికోలో లోయలో పడిన బస్సు…17 మంది మృతి,22 మందికి గాయాలు

Mexico bus accident

Mexico : మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పశ్చిమ మెక్సికోలో ప్రయాణీకుల బస్సు జాతీయ రహదారి నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. (Fell Down Ravine In Mexico) టిజువానా వైపు వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తూ 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయిందని మెక్సికో పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ చెప్పారు.

Ind Vs WI : భారత్‌కు బిగ్ షాక్.. ఉత్కంఠభరిత పోరులో పరాజయం

మృతుల్లో ముగ్గురు పిల్లలు, 14 మంది పెద్దలున్నారు. సివిల్ ప్రొటెక్షన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది అంబులెన్సులతో వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు భారతీయ పౌరులు బస్సులో ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ( 6 Indians Onboard Bus)

Tomato Prices : అమ్మబాబోయ్.. కేజీ టమాటా రూ.300? త్వరలోనే భారీగా పెరగనున్న ధర, షాకింగ్ న్యూస్ చెప్పిన వ్యాపారులు

మెక్సికోలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో మరో బస్సు ప్రమాదంలో 29 మంది మరణించారు. ఫిబ్రవరిలో దక్షిణ, మధ్య అమెరికా నుంచి వచ్చిన మరో బస్సు సెంట్రల్ మెక్సికోలో ప్రమాదానికి గురై 17 మంది మరణించారు.