Viral News: ఓ నివాసంలో బయటపడ్డ 135ఏళ్ల నాటి లేఖ.. సీసాలో ఉంచి భద్రపర్చారు.. అందులో ఏమని రాసిఉందంటే?
స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ ప్రాంతంలో ఓ ఇంటిలో మరమ్మతులు చేస్తున్నారు. పీటర్ అలన్ అనే 50ఏళ్ల వ్యక్తి ప్లంబర్ పైప్వర్క్స్ను గుర్తించడానికి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. తొవ్వుతుండగా .. విస్కీ బాటిల్ కనిపించింది. దానిలో లేఖ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని వెంటనే యాజమానికి వివరించాడు. యాజమాని ఎలిద్ స్టింప్సన్, ఆమె ఇద్దరు పిల్లలు కలిసి ఆ లేఖను బయటకు తీసి చదివారు.. అందులో ..
Viral News: స్కాట్లాండ్లోని ఓ నివాసంలో మరమ్మతుల సందర్భంగా తవ్వకాలు జరిపిన సమయంలో 135ఏళ్ల నాటి లేఖ ఒకటి బయటపడింది. విస్కీ బాటిల్లో భద్రపర్చిన ఈ లేఖ విక్టోరియన్ కాలం నాటిదిగా గుర్తించారు. సీసాలోని లేఖను బయటకు తీసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవటంతో ఇంటి యాజమానులు సీసాను పగలగొట్టి అందులోని లేఖను తీసి చదవారు. ఆ లేఖలో ఇద్దరు మగ వ్యక్తుల సంతకాలు చేసి ఉంది. 1887 సంవత్సరం తేదీ వేసి ఉంది.
పీటర్ అలన్ అనే 50ఏళ్ల వ్యక్తి ఎడిన్బర్గ్ ప్రాంతంలోని ఓ ఇంటిలో ప్లంబర్ పనిచేస్తున్నాడు. పైపులైన్ గుర్తించేందుకు తవ్వకాలు జరిపాడు. తొవ్వుతుండగా .. విస్కీ బాటిల్ కనిపించింది. దానిలో విక్టోరియన్ కాలంనాటి లేఖ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని వెంటనే యాజమానికి వివరించాడు. యాజమాని ఎలిద్ స్టింప్సన్. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె ఆ బాటిల్ ను తెరిచేందుకు ప్రయత్నించింది. కానీ పది, ఎనిమిదేళ్ల వయస్సు కలిగిన పిల్లలు వచ్చేవరకు ఆగి ఆ తరువాత ఆ సీసాను పగులగొట్టి ఆ లేఖను సీసా నుంచి బయటకు తీసి చదివింది.
1887 అక్టోబర్ 6 కాలంనాటి లెటర్గా గుర్తించారు. అందులో ఇద్దరు మగ వ్యక్తులు జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీన్ అనే వ్యక్తులు ఈ లెటర్ పై సంతకం చేసినట్లు ఉంది. నోట్ను చదవగా ఇలా వ్రాసి ఉంది.. “జేమ్స్ రిట్చీ మరియు జాన్ గ్రీవ్ ఈ అంతస్తును వేశారు, కానీ వారు విస్కీని తాగలేదు. “ఎవరైనా ఈ బాటిల్ను కనుగొంటే మన దుమ్ము రోడ్డుపై ఎగిరిపోతోందని అనుకోవచ్చు.” అని ఉంది. ఆ తరువాత ఎలిద్ బాటిల్, నోట్ మొక్క చిత్రాన్ని ఫేస్బుక్లో పోస్టు చేసింది. దీంతో ఆ పురాతన కాలంనాటి లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.