Bird flu : చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ..అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కల్లోలం చేస్తోందనుకుంటున్న క్రమంలో చైనాలోనే మరో వింత కేసులు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ కోళ్లకు మాత్రమే వచ్చే ‘బర్డ్ ఫ్లూ’ ఇప్పుడు చైనాలో ఓ మనిషికి వచ్చింది. 41 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని స్వయంగా చైనా ఆరోగ్య కమిషన్ మంగళవారం (జూన్ 1,2021)న వెల్లడించింది.
Bird flu to Human body : కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కల్లోలం చేస్తోందనుకుంటున్న క్రమంలో చైనాలోనే మరో వింత కేసులు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ కోళ్లకు మాత్రమే వచ్చే ‘బర్డ్ ఫ్లూ’ ఇప్పుడు చైనాలో ఓ మనిషికి వచ్చింది. దీంతో కేవలం కరోనా వైరస్ మాత్రమే కాదు ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలోనే ఓ మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని స్వయంగా చైనా ఆరోగ్య కమిషన్ మంగళవారం (జూన్ 1,2021)న వెల్లడించింది. దీంతో ఇప్పుడు పులిమీద పుట్రలాగా మనుషులకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందా? అని ప్రపంచ దేశాలు హడలిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటి వరకూ పక్షులకు ముఖ్యంగా కోళ్లకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాలం నుంచి పరిశోధకులు అంచనాలు వేశారు. కొంతమంది సైంటిస్టులు మనుషులకు కూడా వస్తుందని చెప్పారు. కానీ అది ఇప్పుడు అదే చైనాలో నిజమై కనిపిస్తోంది. చైనాలోని తూర్పు ప్రావిన్స్లోని జెన్జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఆ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ స్వయంగా ప్రకటించింది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) విభాగం వారం రోజుల క్రితం సదరు రోగికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది. ఆ వ్యక్తిలో హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని ప్రకటన రావడంతో చైనా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇది ఇంకెంతమందికైనా సోకి ఉంటుందా? అని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో అనుమానంగా ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బర్డ్ ఫ్లూ సోకిన బాధితుడికి వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. దీంట్లో భాగంగా కొంతమందిని ఇప్పటికే గుర్తించి..న వారందరినీ పరీక్షలు చేస్తున్నారు. అలా వారిని నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. కాగా.. బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెద్దగా లేదని నామ మాత్రంగా మాత్రమే ఉందని కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందవద్దని తెలిపారు.అలాగే పౌల్ట్రీలలో పనిచేసేవారిని కూడా గుర్తించివారికి పరీక్షలు చేస్తున్నారు వైద్య అధికారులు. కానీ ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు పెద్దగా ప్రమాదకారి కాదని వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత ఏప్రిల్ లో ఈశాన్య చైనాలోని షెన్యాంగ్ నగరంలోని అడవి పక్షులల్లో H5N6 ఏవియన్ ఫ్లూ కనుగొన్నారు.
కాగా..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కల్లోలం చేస్తున్న కరోనా వైరస్ చైనా నుంచే ప్రపంచ దేశాలకు వ్యాపించిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కానీ..నిజం కాదని చైనా నిరూపించుకోలేకపోయింది. దీంతో కరోనా వైరస్ చైనా నుంచే ప్రపంచదేశాలకు వ్యాపించిందనే నిర్ధారణగా కొనసాగుతోంది.