Dangerous bacteria: హిమాలయాల మంచు కింద వందలాది డేంజరస్ బ్యాక్టీరియాలు..అవి బయటపడితే..కరోనాను మించిన కల్లోలమే..

హిమాలయాల్లో మంచు అడుగున పెద్ద సంఖ్యలో ప్రమాదకర సూక్ష్మజీవులు కూరుకుపోయి ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల టిబెట్ ప్రాంతంలోని 21 గ్లేసియర్లు మంచు అడుగు నుంచి తీసిన శాంపిల్స్ ను పరిశీలించి బ్యాక్టీరియాలు, వైరస్ లు కలిపి ఏకంగా వందలాదిగా ఉన్నట్టు కనుగొన్నారు. అవి బయటపడితే కరోనాను మించి కల్లోలం తప్పదని హెచ్చరిక..

Dangerous bacteria: హిమాలయాల మంచు కింద వందలాది డేంజరస్ బ్యాక్టీరియాలు..అవి బయటపడితే..కరోనాను మించిన కల్లోలమే..

Dangerous Bacteria Under The Snow Of The Himalayas.

Dangerous bacteria under Himalayas : ఇప్పటికే ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ తో నియంత్రించినా పలు విధాలుగా రూపాలు మార్చుకుని భయపెడుతునే ఉంది. ఈక్రమంలో కరోనాను మించిన వైరస్ ల ప్రమాదం ఉందంటూ పరిశోధకులు తెలిపారు. హిమాలయాల్లో మంచు అడుగున పెద్ద సంఖ్యలో ప్రమాదకర సూక్ష్మజీవులు కూరుకుపోయి ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల టిబెట్ ప్రాంతంలోని 21 గ్లేసియర్లు (భారీ మంచు నిల్వలు) మంచు అడుగు నుంచి తీసిన శాంపిల్స్ ను పరిశీలించి బ్యాక్టీరియాలు, వైరస్ లు కలిపి ఏకంగా 968 సూక్ష్మజీవులు ఉన్నట్టు కనుగొన్నారు. దీంతో వాటిపై జీనోమ్ సీక్వెన్సింగ్, ప్రోటీన్ల విశ్లేషణ వంటి పరీక్షలు చేశారు. అందులో కొన్ని రకాల బ్యాక్టీరియాలకు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు.

ఈ బ్యాక్టీరీయాలు బయటికొస్తే ప్రమాదమే కరోనా వంటి ప్రమాదమే..
ఈ గ్లేసియర్ల అడుగున సూక్ష్మజీవులపై చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన పరిశోధకులు ఇటీవల పరిశోధన చేశారు. సుమారు 968 రకాల సూక్ష్మజీవులను గుర్తించగా.. అందులో 98 శాతం ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త సూక్ష్మజీవులే కావడం గమనించాల్సిన విషయం. అవన్నీ మంచు కింద కూరుకుపోయి ఉన్నాయని.. శాస్త్రవేత్తలు తెలిపారు. మంచు కరిగిపోతే అవి బయటకు వచ్చే ప్రమాదముందని తెలిపారు.అవేగనుక బయటికి వస్తే.. కరోనాలాంటి మహమ్మారుల్లా మారి, ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఈ బ్యాక్టీరియాలపై చేసిన పరిశోధనలో 27 వేల రకాల వైరులెన్స్ ఫ్యాక్టర్స్ (మనుషులు, ఇతర జంతువులకు సోకి.. వాటి కణాల్లో భారీగా పునరుత్పత్తి చెందే సామర్థ్యం) గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గ్లోబల్ వార్మింగ్ తో కరుగుతున్న మంచు..ముప్పు తప్పదనే ఆందోళన..
గత కొన్ని దశాబ్దాలుగా మానవ తప్పిదాలతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. వీటి ఫలితమే అధిక ఎండలు..అధిక వర్షాలు కురుస్తున్నాయి. మండిపోతున్న ఎండలతో హిమాలయాల్లో మంచుఫలకలు కరిగిపోతున్నాయి. మంచుఫలకాలు కరిగిపోతుండటంపై పర్యావరణవేత్తలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే మంచుకింద కూరుకుపోయి ఉన్న ప్రమాదకర సూక్ష్మజీవులు బయటికి వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా బ్యాక్టీరియాలకు తమ జెనెటిక్ కోడ్ ను పంచుకునే లక్షణం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గ్లేసియర్ల లోని బ్యాక్టీరియాలు, బయట వాతావరణంలోని బ్యాక్టీరియాలు జెనెటిక్ కోడ్ ను పంచుకుంటే.. అన్ని వాతావరణాలను, పరిస్థితులను తట్టుకునేలా మారుతాయని చెబుతున్నారు. ఇదే జరిగితే మానవాళికి కొత్త కొత్త మహమ్మారుల ముప్పు పొంచి ఉన్నట్టేనని హెచ్చరిస్తున్నారు.