వ్యక్తి కడుపులో స్క్రూలు, బోల్టులు
ఓ వ్యక్తి కడుపులో ఇనుప వస్తువులను డాక్టర్లు గుర్తించారు. లిత్వేనియాలో ఓ వ్యక్తి కడుపులో కేజీ స్క్రూలు, బోల్టులను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటికి తీశారు.
ఓ వ్యక్తి కడుపులో ఇనుప వస్తువులను డాక్టర్లు గుర్తించారు. లిత్వేనియాలో ఓ వ్యక్తి కడుపులో కేజీ స్క్రూలు, బోల్టులను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటికి తీశారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లిత్వేనియాకు చెందిన వ్యక్తి మొదట మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత దాన్ని మానుకునే క్రమంలో అనుకోకుండా స్క్రూలు, బోల్టులు, గోర్లు తినడం అలవాటు చేసుకున్నాడు.
దీంతో కొంత కాలంగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని అంబులెన్స్లో క్లైపెడా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వ్యక్తికి స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
Telangana : బీఈడీ చదివి..భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న విద్యావలంటీర్ బతుకు చిత్రం
దీంతో డాక్టర్లు అతనికి ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటలపాటు శ్రమించిన సరునాస్ డైలీడేనాస్ డాక్టర్లు అతని కడుపులో నుంచి కేజీ బరువున్న స్క్రూలు, బోల్టులు, గోర్లను బయటకు తీశారు. ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.