బాత్రూమ్‌లో అద్దం విలువ రూ. 7.5లక్షలు.. తెలిసి ఆశ్చర్యపోయిన కుటుంబం!

  • Published By: vamsi ,Published On : November 3, 2020 / 03:40 PM IST
బాత్రూమ్‌లో అద్దం విలువ రూ. 7.5లక్షలు.. తెలిసి ఆశ్చర్యపోయిన కుటుంబం!

The antique mirror: అద్దం విలువ అంటే ఎంత ఉంటుంది? మహా అయితే 100రూపాయలు ఉంటుంది అంతే కదా? బాత్రూమ్‌లో పెట్టుకునే అద్దం మహా అయితే బాగా అలంకరించుకోవాలంటే ఒక వెయ్యి ఉంటుంది. అయితే ఈ అద్దం విలువ ఎంతో తెలుసా? 8 వేల పౌండ్లు అంటే అక్షరాల ఏడున్నర లక్షలు(7,68,590.90 రూపాయలు). రోజూ ఉదయాన్నే లేచి బాత్రూమ్‌లో పెట్టుకుని చూసుకునే ఆ అద్దం వేలంలో అంత ఖరీదు పలుకతుంది అని కూడా ఆ కుటుంబానికి తెలియదు. రోజు లేవగానే బ్రష్‌ చేసుకుంటూ ముఖం చూసుకునే తమ బాత్రూం అద్దం వెనక ఎంతో చరిత్ర ఉందని ఆశ్చర్యపోయారు.



అద్దానికి అంత ఖరీదు ఎందుకు అంటే.. అది ఫ్రాన్స్‌ చివరి రాణి మేరీ ఆంటోనిట్టేకు చెందినది కావడమే. 19, 15 అంగుళాలు ఉన్న ఆ అద్దం 18వ శతాబ్దానికి చెందినది కాగా.. తూర్పు బ్రిస్టల్‌ వేలం కంపెనీ ఈ అద్దానికి వేలం నిర్వహించింది. దీని చుట్టూ ఉన్న నగిషీలను 19వ శతాబ్దంలో చెక్కినట్లు గుర్తించారు. ఇక ఫ్రేమ్‌లోని వెండి ఫలకం మీద ఈ అద్దం తొలుత మేరీ ఆంటోనిట్టే వద్ద ఉండేదని తరువాత దాన్ని మూడవ నెపోలియన్‌ భార్య ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని ఉంది.



ఈ అద్దం ఉన్న కుటుంబంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. మా అమ్మమ్మ నుంచి ఈ అద్దాన్ని వారసత్వంగా పొందినట్లుగా చెప్పారు. అయితే దాని నిజమైన విలువను గ్రహించకుండా మా బాత్రూంలో వేలాడదీసినట్లు చెప్పాడు. ఈస్ట్ బ్రిస్టల్ వేలం ఐడెన్ ఖాన్ మాట్లాడుతూ.. “ఈ అద్దానికి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ పాపం ఇంతకాలం బాత్రూంలో ఉండిపోయింది. ఇది చరిత్ర నిజమైన భాగం- పద్దెనిమిదవ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వ్యక్తులకు దీనితో దగ్గరి సంబంధం ఉంది” అన్నారు. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చివరి రాణి. లూయిస్‌ 16ని పెళ్లి చేసుకోగా.. 1774 -1792 మధ్య కాలంలో పాలించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ఉరితీయబడ్డారు.