చైనాకు చుక్కలే.. మరో మిస్సైల్ ను సిద్ధం చేసిన DRDO

చైనాకు చుక్కలే.. మరో మిస్సైల్ ను సిద్ధం చేసిన DRDO

నరేంద్ర మోడీ గవర్నమెంట్ DRDO సిద్ధం చేసిన షార్ట్ రేంజ్ డెలివరీ రేంజ్ మిస్సైల్ surface-to-surface supersonic Shaurya strategic missileకు అప్రూవల్ ఇచ్చేసింది. 700కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ధ్వంసం చేయగలదు. 5వేల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను టార్గెట్ చేసే క్రమంలో K-5 సబ్‌మెరైన్ బ్యాలిస్టిక్ మిస్సైల్ ను లాంచ్ చేశారు.




ఈ శౌర్య మిస్సైల్ BA-05కు లాండ్యా వెర్షన్ గా పనిచేస్తుంది. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DRDO) డెవలప్ చేసింది. అప్రూవల్ కు ముందు ఒడిశాలోని బాలాసోర్ లో చివరిసారి పరీక్షించడంతో ప్రయోగంలో సక్సెస్ అయ్యారు.

మిస్సైల్ నిపుణుల ఆధారంగా.. శౌర్య మిస్సైల్ ను కాంపోజిట్ భాగంలో భద్రపరుస్తారు. ఈ స్ట్రాటజీ మిస్సైల్ వాతావరణంలో 50కిలోమీటర్ల ఎత్తులో సెకనుకు 2.4కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.




ఇండియన్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ గుర్తించిన టార్గెట్ లొకేషన్లలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గైడెన్స్ ఆధారంగా వాడతారు. ఈ మిస్సైల్ దాదాపు 160కేజీల బరువు ఉంటుంది. ఈ మిస్సైల్ ను ఒక సింగిల్ వెహికల్ తో లాంచ్ చేసేయొచ్చు. దీంతో పాటు 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే సబ్ మెరైన్ లాంచ్‌డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ ను డెవలప్ చేయనుంది డీఆర్డీఓ.

దాని సామర్థ్యం.. అగ్ని-5 ల్యాండ్ బేస్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్, K-5కు సమానంగా ఉంటాయి. ఈ మిస్సైల్ ను మరో 15నెలల తర్వాత మాత్రమే పరీక్షించనున్నారు. 6వేల టన్నుల బరువున్న అరిఘాట్ ను మాత్రం ఆరు నెలల తర్వాత విధుల్లోకి తీసుకొస్తారు.




లడఖ్ సెక్టార్‌లో పనిచేస్తున్న చైనీస్ ఆర్మీ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ మాట్లాడుతూ.. షార్ట్ రేంజ్ డెలివరీ ప్లాట్ ఫాంల కోసం టెస్టింగ్ చేస్తుందంటే.. మోడీ గవర్నమెంట్ ఇంటెన్షన్ కచ్చితంగా గొడవను పెంచాలనే చూస్తుంది. పొరుగుదేశాలను బెదిరించి విస్తరించుకోవాలనే చూస్తుందని తెలిపింది.