ఆక్స్‌ఫర్డ్‌‌ కరోనా ‘వ్యాక్సిన్‌’ ప్రాజెక్టులో భారతీయ మహిళ 

  • Published By: sreehari ,Published On : April 29, 2020 / 04:00 AM IST
ఆక్స్‌ఫర్డ్‌‌ కరోనా ‘వ్యాక్సిన్‌’ ప్రాజెక్టులో భారతీయ మహిళ 

కొవిడ్-19 వ్యాక్సీన్ కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భారత్‌కు చెందిన చంద్ర దత్తా (34) కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌గా ఈమె పనిచేస్తున్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్‌ వారం క్రితం తొలి దశ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది. బెంగాలీ సైంటిస్టు చంద్రదత్తా కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్‌ పూర్తి చేశారు.

అనంతరం ఆమె ఎమ్మెస్సీ బయోసైన్స్‌ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్‌ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో తన వంతుగా చంద్ర దత్తా కృషి చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్‌తో, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, ఎలాంటి విధానాలు పాటిస్తున్నారో ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో తాను కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. నెల రోజులుగా వ్యాక్సీన్ తయారీకి సంబంధించి ఎంతో ఒత్తిడి అనుభవించామని, వ్యాక్సిన్‌ను త్వరగా తయారు చేయడంలో విజయం సాధించినట్టు ఆమె చెప్పుకొచ్చారు.

చెప్పారు.  పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో సెప్టెంబర్, అక్టోబర్‌లలో భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని వెల్లడించింది. సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీకి 3 నుంచి నాలుగేళ్లు పడుతుంది. కరోనా వ్యాక్సిన్‌ను నెలల వ్యవధిలోనే తయారు చేసినట్టు సంస్థ పేర్కొంది. కరోనాపై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్లు తయారు చేసింది. మరో 1000 వ్యాక్సిన్లు కూడా తయారుచేసే దిశగా ప్రొడక్షన్ చేపట్టనున్నట్టు తెలిపారు.