Earthquake : ఇండోనేషియాలో అర్ధరాత్రి భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!

ఇండోనేషియాలో మంగళవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదైంది.

Earthquake : ఇండోనేషియాలో అర్ధరాత్రి భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!

Indonesia Earthquake 6 2 Ma

Earthquake :  ఇండోనేషియాలో మంగళవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదైంది. యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలజీ సెంటర్ వెల్లడించింది. అందిన సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం 127కిలోమీటర్ల లోతులో ఉంది. భూ ప్రకంపనల తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయినట్టు అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో నుండి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. ఎలాంటి సునామీ హెచ్చరిక చేయలేదు.. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి సమాచారం లేదు.

కెపులావన్ బరాత్ దయా బుధవారం తెల్లవారుజామున 12:55 గంటలకు ఈరోజు భూకంపం సంభవించింది. కెపులావాన్ బరాత్ దయా భూకంప ప్రభావానికి లోనైంది. ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ కాలేదు. అలాగే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. గత నెల జనవరి 19న ఇండోనేషియాలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

అమాహైకి తూర్పున 219 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చాయి. ఇటీవలే ఇండోనేషియాలోని జావా ప్రధాన ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి రాజధాని జకార్తాలోని భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు వెల్లడించారు.

జనవరి 29న, న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ద్వీప ప్రాంతం దక్షిణ పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరలో ఉంది. ఇక్కడే భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Ashureddy : ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ.. అరియనా నడుముపై అషూరెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్