Time-travelling: భవిష్యత్‌లో ప్రపంచం అంతమైపోయింది.. సాక్ష్యం చూపిస్తున్న టైం ట్రావెలర్

ఎడ్వర్డ్ అనే అనే వ్యక్తి ప్రపంచం అంతమైపోయిందని.. భవిష్యత్ లోకి వెళ్లి చూశానంటూ సాక్ష్యం చూపిస్తున్నాడు. 5000వ సంవత్సరం వరకూ తాను ప్రయాణించినట్లు చెబుతూ అప్పటికీ ప్రపంచమంతా వాతావరణ మార్పుల కారణంగా నీటిలో మునిగిపోయి ఉందని చెప్తున్నాడు.

Time-travelling: భవిష్యత్‌లో ప్రపంచం అంతమైపోయింది.. సాక్ష్యం చూపిస్తున్న టైం ట్రావెలర్

Time Travel

Time-travelling: ఎడ్వర్డ్ అనే అనే వ్యక్తి ప్రపంచం అంతమైపోయిందని.. భవిష్యత్ లోకి వెళ్లి చూశానంటూ సాక్ష్యం చూపిస్తున్నాడు. 5000వ సంవత్సరం వరకూ తాను ప్రయాణించినట్లు చెబుతూ అప్పటికీ ప్రపంచమంతా వాతావరణ మార్పుల కారణంగా నీటిలో మునిగిపోయి ఉందని చెప్తున్నాడు.

‘ApexTV’ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాడు. 2004లో ఓ టాప్ సీక్రెట్ మిషన్ లో భాగంగా 3వేల సంవత్సరాల ముందుకు వెళ్లాడట. ఆ సమయంలో లాస్ ఏంజిల్స్ నీటిలో మునిగిపోయి ఉందట. భవిష్యత్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ల్యాబొరేటరీలో ఫొటోగ్రఫిక్ ఇన్ఫిరెన్స్ ద్వారా ఆ ఘటనలను వివరించేపనిలో పడ్డాడు.

‘మీరు షాక్.. ఆశ్చర్యపోయే విషయమొకటి చెప్తా. 2004వ సంవత్సరం యూఎస్ లోని లాస్ ఏంజిల్స్ లో ఘటన గురించి ఇది’ అని తన అనుభవాన్ని ఫిబ్రవరి 2018లో చేసిన వీడియో.. వైరల్ అయింది. తాను ఒక టైం మెషిన్ లో ప్రయాణించినట్లు అందులో పేర్కొన్నాడు. అక్కడ జరిగినదంతా ఆశ్చర్యపోయేలా చేసిందని అంటున్నాడు.

‘నేనొక చెక్క ప్లాట్ ఫాం మీద నిల్చొన్నా.. నేనేకాదు ఇళ్లు, బిల్డింగులు అన్నీ చెక్కతో తయారుచేసినవే. అప్పుడు కానీ, నాకు అర్థం కాలేదు. నేను ఉంది లాస్ ఏంజిల్స్ లో అది కూడా నీటి కింద’ అని అన్నాడు.

ఆ టైం ట్రావెలర్ ముఖం మాత్రం బయటపడనివ్వలేదు. సీక్రెట్ గా మిషన్ కావడంతో అలా చేసి ఉండొచ్చు. టైం ట్రావెలర్స్ అంటూ వాళ్లు గమనించిన విషయాలు బయటపెట్టడం ఇది తొలిసారి కాదు. గతంలో ఓ వ్యక్తి తాను భవిష్యత్ కు వెళ్లి వచ్చానని.. భూమి మీద గ్రహాంతరవాసులు మనుషులపై యుద్ధానికి పాల్పడుతున్నట్లు చెప్పాడు.

అటువంటి విషయాలన్నింటినీ చాలా ఆర్గనైజేషన్లు కొట్టిపారేశాయి. ఎందుకంటే ఇదే అంశాలు ఇప్పటికే పుస్తకాల్లో సినిమాల్లో చూసే ఉన్నామని తేల్చేశాయి.