మస్కట్ మజా : ఒమన్ దేశంలో టీఆర్ఎస్ సంబురాలు..

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 04:06 AM IST
మస్కట్ మజా : ఒమన్ దేశంలో టీఆర్ఎస్ సంబురాలు..

 మస్కట్ : విదేశాలలో టీఆర్ఎస్ సంబురాలు అంబరాన్నంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయాన్ని ఒమాన్ దేశం మస్కట్ లో టీఆర్ఎస్ ఎన్నారై లు సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఅర్ఎస్ ఒమాన్ శాఖ నుంచి అన్ని నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ విజయానికి తమ వంతు కృషి చేసామని తెలిపారు. 

టీఆర్ఎస్ పార్టీ ఆకండ విజయం సాధించినందుకు ఒమాన్ దేశంలో వివిధ ప్రాంతాల్లో వుండే తెలంగాణ వాసులంతా ఈ సంబరాలలో పాలు పంచుకున్నారన్నారు.సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ఒమాన్ శాఖ నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఅర్ఎస్ ఒమాన్ కోర్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ మద్దతుదారులు కుటుంబం సమేతంగా పాల్గొన్నారు.