Pakistan : బలోచిస్థాన్ కెచ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

పాకిస్థాన్ దేశంలో ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాక్ బలోచిస్థాన్ పరిధిలోని కెచ్ జిల్లా మజాబంద్ రేంజ్ రీజియన్ లో ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది గాయపడ్డారు....

Pakistan : బలోచిస్థాన్ కెచ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Pakistan

Pakistan : పాకిస్థాన్ దేశంలో ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాక్ బలోచిస్థాన్ పరిధిలోని కెచ్ జిల్లా మజాబంద్ రేంజ్ రీజియన్ లో ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన అనంతరం ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పాక్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. (Two terrorists killed in Balochistan) బలోచిస్థాన్ పరిధిలోని జోబ్, సూ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు.

BJP Leader Killed : బీజేపీ నేత దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపారు, షాకింగ్ వీడియో

ఈ ఏడాది జులై నెలలో జరిగిన ఉగ్ర దాడుల్లో 12 మంది పాక్ జవాన్లు మరణించారు. గత ఏడాది కూడా బలోచిస్థాన్ కేచ్ జిల్లాలో ఉగ్రవాదులు 10 మంది సైనికులను చంపారు. బలోచిస్థాన్, ఫక్తూన్ ఖవా ప్రాంతాల్లో పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్ సాఫ్ ఉగ్రవాదులకు, పాక్ సైనికులకు మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ దేశంలో ఈ ఏడాది 18 ఆత్మాహుతి దాడులు జరగ్గా ఈ దాడుల్లో 200 మంది మరణించగా, మరో 450 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Punjab : కూతురిని చంపి, మృతదేహాన్ని బైక్ కు కట్టుకుని ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై విసిరేసిన తండ్రి

గత ఏడాది కూడా 15 ఆత్మాహుతి దాడులు జరిగాయి. జులై 30వతేదీన బాజౌర్ ప్రాంతంలో జరిగిన దాుడ్లలో 60 మంది మరణించగా, 150 మంది గాయపడ్డారు. మెయిన్ ల్యాండ్, ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 110 మంది మరణించగా, మరో 245 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ దేశంలో ఉగ్ర దాడులు పెచ్చుపెరిగాయి. దీంతో పాక్ ఆర్మీ కూడా అప్రమత్తమైంది.