world Most Expensive Mangoes : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు..కిలో 2.70 లక్షలు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు..కిలో 2.70 లక్షలు..

world Most Expensive Mangoes : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు..కిలో 2.70 లక్షలు..

World's Most Expensive Miyazaki Mangoes

world’s most expensive Miyazaki mangoes :  మామిడి.భారతదేశ జాతీయ పండు.అనేక ఆయుర్వేద ఔషధగుణాలు కూడా కలిగిన పండు. పండ్లల్లో రాజు. భారతదేశంలో బంగిన పల్లి, కలెక్టర్ మామిడి, నీలవేణి, రసాలు, చెరకు రసం, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణ మామిడి, అరటి మామిడి, కొబ్బరి మామిడి ఇలా అనేక రకాల మామిడి పండ్లను ఎక్కువగా పండిస్తారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం మామిడి పండ్లు భారత దేశం నుంచే అవుతాయి. అయితే మామిడి పండ్లలో అత్యంత ఖరీదైన వెరైటీ మామిడి మాత్రం మనదేశానికి చెందినది కాదు.

చూడ చక్కని ఊదా రంగులో ఉండే ఈ మామిడి కాయను మియాజాకి మామిడి అని అంటారు. ఊదారంగులో ఉండే ఈ మామిడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నోరెళ్లబెట్టేస్తాం. బాబోయ్ మామిడి పండ్లు ఇంత ధర ఉంటాయా? అని అనిపిస్తుంది. వందల రూపాయలు కాదు కదా వేలు రూపాయలకు కూడా కాదు ఏకంగా లక్షల ధర పకుతుంది..!

ఇంత భారీ ధరప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిపండు నిజానికి జపాన్‌కు చెందినది. దీనిని మియాజాకి మామిడి అని పిలుస్తారు. మియాజాకి నగరంలో 1970-1980ల మధ్య మామిడి పండించడం ప్రారంభించారని తెలుస్తోంది. జపాన్‌లోని మియాజాకి నగరంలో పండిస్తారు. అందుకే దానికి ఈ పేరు వచ్చింది. ఇది దేశంలో పండించే అత్యంత ప్రసిద్ధ పండ్లలో ఒకటి మరియు 350g కంటే ఎక్కువ బరువు ఉంటుంది. 15% లేదా అంతకంటే ఎక్కువ చక్కెర కంటెంట్ ఉంటుంది. ఇది జపాన్‌లోని మియాజాకి నగరంలో పండిస్తారు.

అత్యంత నాణ్యమైన మియాజాకి మామిడి పండ్లను ‘తైయో-నో-టొమాగో’ (జపాన్ భాష) లేదా ‘సూర్యరశ్మి గుడ్లు’గా అని అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు ఊదా రండులో ఉండే ఈ మామిడి పండు పండినప్పుడు ఎర్ర రంగులోకి మారతాయి. ఈ మామిడి కాయ చూడడానికి డైనోసార్ గుడ్డు ఆకారంలో ఉంటుంది.

మియాజాకి మామిడి సాగుకు అధిక సూర్యరశ్మి, వెచ్చని వాతావరణం, పుష్కలంగా వర్షపాతం అవసరం. ఈ పండ్లు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మామిడి పండ్లలో ఎక్కువ భాగం మే నుండి జూన్ మధ్య అమ్ముడవుతుంది. మియాజాకి మామిడిలో యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. ఈ పండు దృష్టిలోపం కలిగినవారికి చక్కటి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది.

ఇది ప్రపంచంలో అత్యంత ప్రీమియం పండ్లలో ఒకటి. జపాన్‌లో విక్రయించే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. అంతర్జాతీయ మార్కెట్ లో కిలో మామిడి ధర రూ. 2.70 లక్షల నుంచి మూడు లక్షల వరకూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డ్ సృష్టించిన ఈ అరుదైన మామిడి పండ్లు భారతదేశం,బంగ్లాదేశ్‌, థాయిలాండ్ , ఫిలిప్పీన్స్‌లో కూడా పండిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఒక జంట జబల్‌పూర్‌లోని తమ పొలంలో మియాజాకి మామిడి రకాన్ని పండించారు. అరుదైన మామిడి పండ్లను దొంగిలించకుండా కాపాడేందుకు నలుగురు గార్డులను, ఏడు కుక్కలను నియమించుకోవాల్సి వచ్చింది. అంతేగా మరి..బంగారం ధర కంటే ఎక్కువగా ఉండే ఈ మామిడి పండ్లకు ఆ మాత్రం కాపలా లేకపోతే ఎలా..