Adivi Sesh : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్..

ఇటీవల డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరిన నటుడు అడివి శేష్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు..

Adivi Sesh : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్..

Adivi Sesh

Adivi Sesh: పాపులర్ టాలీవుడ్ యాక్టర్, రైటర్ అడివి శేష్ అనారోగ్యంతో సెప్టెంబర్ 20న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.. కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు శేష్.. బ్లడ్‌లో ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోవడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది.

Bollywood Films : ‘పుష్ప’ తో సహా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న పది సినిమాలు..

కుటుంబ సభ్యులు ఆయణ్ణి ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యులు మెరుగైన చికిత్సనందించడంతో కోలుకున్న అడివి శేష్ రీసెంట్‌గా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.

Bollywood Couples : పెళ్లి అప్పుడే అంటున్న బాలీవుడ్ కపుల్స్..!

సినిమాల విషయానికొస్తే.. 26/11..ముంబై తాజ్ హోటల్‌పై ముష్కరులు జరిపిన దాడిలో ఎన్ఎస్జీ కమెండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. ఈ రియల్ హీరో ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్న సినిమా.. ‘మేజర్’.

Pushpa Update : సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..

తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్, ఎప్లస్ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ‘గూఢచారి’ తర్వాత శేష్, శోభిత ధూళిపాల కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది.