Pathaan : పఠాన్ వల్ల 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడ హౌస్ ఫుల్.. షారుఖ్ మేనియా..

షారుఖ్ పఠాన్ హిట్ అయి భారీగా కలెక్షన్స్ వస్తుండటంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు, ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తున్న పఠాన్ సినిమా ఓ సరికొత్త రికార్డుని సృష్టించింది.................

Pathaan : పఠాన్ వల్ల 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడ హౌస్ ఫుల్.. షారుఖ్ మేనియా..

after 32 years house full in kashmir theaters with shahrukh pathaan movie

Pathaan :  షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ లో సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా పఠాన్. షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అంతే కాకుండా షారుఖ్ గత సినిమాలు పరాజయం అవ్వడం, పఠాన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పఠాన్ సినిమా జనవరి 25న దాదాపు 100 దేశాల్లో రిలీజయింది.

ఇప్పటికే ఈ సినిమా దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి దూసుకుపోతుంది. షారుఖ్ అభిమానులు కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమాతో బాలీవుడ్ కి కూడా ఊపిరి వచ్చినట్లైంది. గత కొన్నాళ్లుగా మంచి హిట్, కలెక్షన్స్ వచ్చే సినిమాల్లేక బాలీవుడ్ అల్లాడిపోయింది. షారుఖ్ పఠాన్ హిట్ అయి భారీగా కలెక్షన్స్ వస్తుండటంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు, ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తున్న పఠాన్ సినిమా ఓ సరికొత్త రికార్డుని సృష్టించింది.

కశ్మీర్‌ లోయలోని థియేటర్స్ కి ప్రేక్షకులు తక్కువగా వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఉగ్రవాద సమస్యల వల్ల గతంలో థియేటర్స్ కూడా సరిగ్గా రన్ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో 2021 నుంచి అక్కడ థియేటర్స్ ని మళ్ళీ బాగు చేసి రన్ చేస్తున్నారు. అక్కడి పాత థియేటర్స్ ని తీసుకొని ఐనాక్స్‌ లాంటి సంస్థలు మల్టిప్లెక్స్ లుగా మార్చాయి. అలా మార్చిన ఓ ఐనాక్స్ థియేటర్ లో తాజాగా పఠాన్ సినిమా రిలీజయింది. అయితే దాదాపు 32 సంవత్సరాలుగా ఆ థియేటర్ లో హౌస్ ఫుల్ అవ్వలేదంట. పఠాన్ సినిమా వల్ల 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడి థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారంట.

Ranbir kapoor : సెల్ఫీ అడిగాడని అభిమాని ఫోన్ విసిరేసిన రణబీర్..

దీనిపై ఐనాక్స్ స్పెషల్ ట్వీట్ చేసింది. కశ్మీర్ లోయలోని ఆ థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డు ఉన్న ఫోటోని షేర్ చేసి.. దేశమంతా పఠాన్ సినిమా సందడి చేస్తున్న సమయంలో 32 సంవత్సరాల తర్వాత కశ్మీర్ లోయలోని మా థియేటర్లో హౌస్‌ఫుల్ బోర్డుని తీసుకొచ్చినందుకు కింగ్ ఖాన్‌కు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యు షారుఖ్, పఠాన్ టీం అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.