Ajith Kumar: 22 ఏళ్ల తరువాత అజిత్తో స్టార్ హీరోయిన్ రొమాన్స్..?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’(తెలుగులో ‘తెగింపు’) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేయగా, ఈ సినిమాలో అజిత్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోత్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’(తెలుగులో ‘తెగింపు’) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేయగా, ఈ సినిమాలో అజిత్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోత్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.
Ajith: ‘వారసుడు’ని నెట్టుకుంటూ వస్తున్న అజిత్.. అర్ధరాత్రికే తెగింపు చూడనున్న ఫ్యాన్స్!
కాగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు విఘ్నేష్ శివన్తో తెరకెక్కించేందుకు అజిత్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అజిత్ కెరీర్లో 62వ మూవీగా తెరకెక్కనుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అజిత్ సరసన హీరోయిన్గా ఐశ్వర్య దాదాపు 22 ఏళ్ల తరువాత స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
Ajith – Arvind Swamy : అజిత్కి విలన్గా అరవింద్ స్వామి..
గతంలో ‘ప్రియురాలు పిలిచింది’ సినిమాలో వీరిద్దరి కలిసి నటించారు. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఇద్దరు ఒకే స్క్రీన్పై కనిపించనున్నారనే వార్త కోలీవుడ్లో జోరందుకుంది. అయితే ఈ సినిమాలో నటించే విషయంపై ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే ఐశ్వర్య ఈ సినిమాలో నటిస్తే మాత్రం అజిత్ ఫ్యాన్స్కు ఇది పండగ లాంటి వార్తే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయనున్నారు.