Ajith : 22 ఏళ్ళ తర్వాత అజిత్-టబు కాంబినేషన్లో సినిమా

వినోత్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాతగా మరో సినిమాని 'వలిమై' రిలీజ్ అవ్వకుండానే ఇటీవల అనౌన్స్ చేశారు. ఆ సినిమా కథ కూడా పూర్తయినట్లు, అజిత్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.........

Ajith : 22 ఏళ్ళ తర్వాత అజిత్-టబు కాంబినేషన్లో సినిమా

Ajith Tabu

Ajith-Tabu  :  తమిళ్ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో, వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం అజిత్ నుంచి ‘వలిమై’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇందులో మన తెలుగు యువ హీరో కార్తికేయ విలన్ గా నటించడం విశేషం. ఈ సినిమాని వినోత్ తెరకెక్కించగా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. పాన్ ఇండియా సినిమాగా ‘వలిమై’ని రిలీజ్ చేయబోతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

అయితే ఇదే సినిమా టీం కాంబినేషన్లో మరో సినిమా కూడా ఓకే అయింది. వినోత్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాతగా మరో సినిమాని ‘వలిమై’ రిలీజ్ అవ్వకుండానే ఇటీవల అనౌన్స్ చేశారు. ఆ సినిమా కథ కూడా పూర్తయినట్లు, అజిత్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇది కూడా ‘వలిమై’ లాగే యాక్షన్ డ్రామా జోనర్లో ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా ‘టబు’ను తీసుకున్నట్టు సమాచారం.

Allu Arjun : అతనికి మ్యూజిక్ అవసరం లేదు.. సిద్ శ్రీరామ్‌ని పొగిడేసిన బన్నీ

2000వ సంవత్సరంలో రాజీవ్ మీనన్ దర్శకత్వంలో అజిత్- టబు కాంబినేషన్లో ‘కండుకొండైన్ కండుకొండైన్’ సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమా ‘ప్రియురాలు పిలిచింది’ అనే పేరుతో విడుదల అయింది. రెండు భాషల్లోనూ ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇందులో పాటలైతే ఇప్పటికి క్లాసికల్ గా నిలిచాయి. ఈ సినిమాలో అజిత్-టబు మధ్య జరిగిన కెమిస్ట్రీ చూసి అభిమానులు వీళ్లిద్దరి జంటకి ఫ్యాన్స్ గా మారిపోయారు. దీంతో అజిత్-టబు జోడి అప్పట్లో బెస్ట్ పెయిర్ గా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి దాదాపు 22 ఏళ్ల తరువాత అజిత్-టబు జోడి నుంచి సినిమా రాబోతుంది. ఆ సినిమాతో పాటు వీళ్లిద్దరి ఫ్యాన్స్ కి ఈ కొత్త సినిమా అనౌన్సమెంట్ ఫుల్ జోష్ ని ఇచ్చింది.