Sania Mirza: షాకిచ్చిన సానియా-షోయబ్.. రియాలిటీ షోలో జంటగా కనిపించనున్న కపుల్
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే అందరికీ షాకిచ్చింది ఈ జంట.
Sania Mirza: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ అందరికీ షాకిచ్చారు. ఒకవైపు వారి విడాకుల గురించి ఊహాగానాలు చెలరేగుతుంటే.. మరోవైపు ఇద్దరూ కలిసి ఒక రియాలిటీ షోలో కనిపించనున్నారు.
‘ఉర్దూఫ్లిక్స్’ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్పై నిర్వహిస్తున్న ఒక రియాలిటీ షోలో జంటగా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ‘ఉర్దూఫ్లిక్స్’ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ద మీర్జా మాలిక్ షో’ పేరుతో రూపొందిన ఈ షో త్వరలోనే ప్రసారం కాబోతుందని ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ఫొటో చూస్తే ఇది దుబాయ్లో చిత్రీకరించిన షో అని అర్థమవుతోంది. కారణం ఫొటో బ్యాగ్రౌండ్లో బుర్జ్ ఖలీఫా కనిపిస్తోంది. ప్రస్తుతం సానియా-షోయబ్ ఇద్దరూ దుబాయ్లోనే ఉన్నారు. కాగా, సానియా-షోయబ్ 2010లో పెళ్లి చేసుకున్నారు.
కొంతకాలంగా ఇద్దరిమధ్య విబేధాలు తలెత్తినట్లు, దీంతో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఒక రియాలిటీ షో చేస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కొందరు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం విడాకుల వ్యవహారం పబ్లిసిటీ స్టంట్ అయ్యుండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, విడాకుల ప్రచారంపై ఎవరో ఒకరు స్పష్టత ఇస్తే తప్ప ఈ ఊహాగానాలు ఆగిపోవు.