Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్లో మహిళల కెప్టెన్గా హర్మన్ ప్రీత్
మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బృందానికి కెప్టెన్సీ వహించేందుకు హర్మన్ ప్రీత్ ఎంపికైంది. జులై 28 నుంచి బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ గేమ్స్ కు స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
Commonwealth Games 2022: మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బృందానికి కెప్టెన్సీ వహించేందుకు హర్మన్ ప్రీత్ ఎంపికైంది. జులై 28 నుంచి బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ గేమ్స్ కు స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కామన్వెల్త్ క్యాలెండర్ లో మహిళల టీ20 క్రికెట్ తొలిసారి పాల్గొనడం ఇదే. ఇంతకంటే ముందు 1998లో జరిగిన కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల వన్డే టోర్నమెంట్ జరిగింది.
T20 ఫార్మాట్లో అండర్-100 స్ట్రైక్ రేట్ ఉన్న వికెట్-కీపర్ తానియా భాటియా ఈ గేమ్స్కు స్థానం దక్కించుకుంది. మరోవైపు డాషింగ్ బ్యాటర్, రిచా ఘోష్ స్టాండ్-పై ఉండనుంది. గాయం కారణంగా శ్రీలంక సిరీస్కు దూరమైన స్నేహ రానా జాతీయ జట్టులో కమ్ బ్యాక్ చేసేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కు పంపారు.
యాస్టికా భాటియా టీమిండియా ఫస్ట్-ఛాయిస్ స్టంపర్గా అవకాశం ఉంది. జట్టులో వెటరన్ లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ , సీమర్ సిమ్రాన్ దిల్ బహదూర్తో పాటు స్టాండ్బై లిస్ట్లో కూడా ఉన్నారు.
Read Also: కామన్వెల్త్ గేమ్స్లో ఫస్ట్ టైమ్ క్రికెట్.. షెడ్యూల్ ఇదే..!!
ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్లతో భారత్ గ్రూప్-ఎలో ఉంది. శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా గ్రూప్ Bలో ఉన్నాయి. జూలై 29న ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
కామన్వెల్త్ గేమ్స్, బర్మింగ్హామ్లో ఆడేందుకు భారత మహిళల జట్టు ప్రయాణం కానుంది. ఈ ఈవెంట్లో గట్టి పోటీనే ఎదుర్కోనుంది. ఇదిలా ఉంటే, భారత మహిళల జట్టు మొదటి కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాన్ని పొందాలని కోరుకుంటుంది. శ్రీలంకలో పర్యటించిన భారత మహిళలు 3 మ్యాచ్ల ODI సిరీస్లో ఆతిథ్య జట్టుపై 3-0 తేడాతో ఓడిపోయారు.
కామన్వెల్త్ గేమ్స్ మహిళల జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా (Wk), యాస్తికా భాటియా (Wk), దీప్తి శర్మ , రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ , మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్ , రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రానా.